తెలుగు రాష్ట్రాల్లో కొత్త సంవత్సర వేడుకలు ముగియడంతో ఇంకా సంక్రాంతి వేడుకలు మొదలయ్యాయి.ఇందులో భాగంగా తెలుగు పరిశ్రమలో మూడు భారీ చిత్రాలు విడుదల అవుతుండటంతో వేడుకలకు బదులుగా ఉత్కంఠ నెలకొంది.
ఇందులో భాగంగా అనిల్ రావి పూడి దర్శకత్వం వహించిన టువంటి సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల అవుతోంది. అయితే ఇప్పటికే ఈ చిత్ర ట్రైలర్ విడుదలయి మంచి ప్రేక్షకాదరణ పోందింది.
దీంతో డిస్ట్రిబ్యూటర్స్ ఈ సినిమాని కొనడానికి ఎగబడుతున్నట్లు సమాచారం.అయితే అందుకు సంబందించిన సినిమా థియేటర్లను కూడా సిద్ధం చేసుకుంటున్నారు.
దీంతో ఈ చిత్రానికి ఎటువంటి థియేటర్ల కొరత లేకపోవచ్చు.
అయితే ఒక రోజు గ్యాప్ తీసుకుని ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నటువంటి అల వైకుంఠ పురంలో చిత్రం కూడా ఈ సంక్రాంతికి విడుదలవుతోంది.
ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి పాటలు విడుదలవడంతో మంచి ప్రేక్షకాదరణ పొందాయి.ఈ చిత్రాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు.అయితే ఈ చిత్రానికి కూడా ఈ చిత్రానికి ఎటువంటి థియేటర్ల కొరత పెద్దగా లేకపోవచ్చని అంటున్నారు సినీ విశ్లేషకులు.
అయితే ఈ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరూ, అలా వైకుంఠపురంలో చిత్రాలకంటే ముందుగా రజనీకాంత్ దర్భార్ అనే చిత్రంతో ఈ నెల 9వ తారీఖున వస్తున్నాడు.ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు ఏ.ఆర్ మురగదాస్ దర్శకత్వం వహించాడు.అయితే ప్రస్తుతం ఈ చిత్రానికి డిస్ట్రిబ్యూటర్ల నుంచి కొంతమేర అసహనం వ్యక్తవర్థన్నట్లు తెలుస్తోంది.ఎందుకంటే గతముల్,ఓ భారీ అంచనాల నడుమ వచ్చిన కబాలి డిజాస్టర్ కావడంతో ఇప్పుడు ఈ చిత్రానికి కొండానికి బయ్యర్లు కొనడానైకి భయపడుతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ సంకరంతి బరిలోకి దిగుతున్న ఈ చిత్రాల్లో ఏది విజయం సాధిస్తుంది చూడాలి.