నేడు ఖమ్మంలో సంకల్ఫ సభ.. పాల్గొననున్న షర్మిల.. !

చుట్టూ ఎన్నో ప్రతికూల పరిస్దితుల మధ్య దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల రాజకీయ రంగప్రవేశం చేస్తుంది.అది కూడా తెలంగాణలో.

 Sankalpa Sabha In Khammam Today Sharmila To Participate   Ys Sharmila, Khammam,-TeluguStop.com

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో గులాభి పార్టీకి ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే.కారు దాటికి కాంగ్రెస్, టీడీపీ, చివరికి కమలం కూడా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ అష్టకష్టాలుపడుతూ రాజకీయ రహదారిలో ప్రయణిస్తున్నాయి.

అలాంటిది షర్మిల రాజకీయ రంగ ప్రవేశం ప్రతి వారిలో ఆసక్తి కలిగిస్తుంది.

నేడు ఖమ్మంలోని పెవిలియన్‌ గ్రౌండ్‌లో జరిగే సంకల్ప సభలో పాల్గొననున్న షర్మిల, ఈ సభలో తన రాజకీయ భవిష్యత్, కొత్త పార్టీపై కీలక ప్రకటన చేస్తారని వార్త ప్రచారం జరుగుతుంది.

ఇదిలా ఉండగా ఈ సభకు వైఎస్ విజయమ్మ కూడా వస్తుండటంతో ఆసక్తి రేపుతోంది.

ఇదివరకే ఈ భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున ఆమె అనుచర నేతలు, శ్రేణులు తరలి వచ్చేలా ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, కాగా షర్మిల ఉదయం 5 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరి సాయంత్రం 5.15 గంటలకు పెవిలియన్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుంటారని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube