ఇండియన్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ లు దేశ వ్యాప్తంగా యువతని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.క్రికెట్ లీగ్ మ్యాచ్ లో భాగంగా ఈ రోజు హైదరాబాద్ లో ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత ఓవర్స్ పూర్తయ్యే సమయానికి 198 పరుగుల భారీ స్కోర్ చేసింది.ఇందులో రహనే 70 పరుగులతో రాణించాడు.
ఇదిలా ఉంటే సన్ రైజర్స్ బౌలర్స్ ని యువ బ్యాట్స్ మెన్ సంజు శాంసన్ ఊచకోత కోసాడు.అందరు బౌలింగ్ లో భారీ పరుగులు రాబట్టిన సంజు కెరియర్ లో మొదటి టీ-20 సెంచురీతో పాటు, ఐపీఎల్ సీజన్ 12 మరో సెంచురీ నమోదు చేసాడు.
ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగుతున్న సన్ రైజర్స్ ఎ మాత్రం ఆధిక్యం అందుకుంటుంది అనేది వేచి చూడాలి.