భారత దేశంలో క్రికెట్ కు ఉన్న అభిమానులు ఏ ఆటకు లేరని చెప్పవచ్చు.ప్రస్తుతం ఐపీఎల్ 14 భారత అభిమానులను అలరిస్తోంది.
ఎంతో మంది యువ ఆటగాళ్లు ఐపీఎల్లో వారి సత్తా చాటి వారి కెరియర్ కు ఓ మార్గాన్ని ఏర్పరచుకుంటారు.ఇందులో భాగంగానే ప్రస్తుతం ఉన్న యువ ఆటగాళ్లలో ప్రతిభగల ఆటగాడు సంజు సాంసంగ్.
మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్ తో టీమిండియా జట్టులో వికెట్ కీపర్ కి ఏర్పడిన ఖాళీ ని పూరించడానికి ఒకవైపు రిషబ్ పంత్.మరోవైపు సంజూ శాంసన్ లలో ఎవరో ఒకరు ఆ స్థానాన్ని భర్తీ చేస్తారని అంతా భావించగా గతకొద్దికాలంగా అదృష్టం రిషబ్ పంత్ వైపు మొగ్గు చూపుతూ వస్తోంది.
దీనికి కారణం అతడు గత రెండు సిరీస్లో తన బ్యాటింగ్ విన్యాసాన్ని ప్రదర్శించిన తీరే.జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వీరోచిత ఇన్నింగ్స్ లో ఆడే పంత్ టీమిండియాకు విజయాన్ని అందించాడు.
అయితే ఇందులో భాగంగానే తాజాగా ఐపీఎల్ లో ఢిల్లీ జట్టు కెప్టెన్ బాధ్యతలు రిషబ్ పంత్ దగ్గరగా రాజస్థాన్ కెప్టెన్ గా సంజు శాంసన్ కు దక్కాయి.
ఇక తాజాగా జరిగిన ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్ లో బ్యాట్స్మెన్స్ అందరూ అనుకోకుండా విఫలం కావడంతో రాజస్థాన్ ఓటమి అంచు వరకు వెళ్ళింది.
అయితే ఆ సమయంలో సీనియర్ ఆల్రౌండర్ క్రిస్ మోరిస్ తనదైన శైలిలో కేవలం 18 అందులోనే 36 పరుగులు చేసి నాటౌట్ గా నిలవడంతో రాజస్థాన్ రాయల్స్ విజయాన్ని అందుకుంది.
అయితే ఈ మ్యాచ్ లో సంజూ శాంసన్ అందరినీ ఆశ్చర్య పరిచేలా ఓ పని చేశాడు.సంజు శాంసన్ మోరీస్ క్రిజ్ లో ఉన్నారు.ఈ సమయంలో ఒక్క పరుగు తీయాల్సిన అవకాశం వచ్చింది.
అది తీస్తే మెమోరీస్ కి స్ట్రైకింగ్ వస్తుంది.అయితే బాల్ ఆడిన తర్వాత దాదాపుగా అవతల క్రీజ్ వరకు మోరిస్ చేరుకున్న కానీ సంజూ శాంసన్ అతన్ని తిరిగి వెనక్కి పంపేశాడు.
ఈ దెబ్బతో మెమోరీస్ కి పెద్ద షాకే తగిలింది అని చెప్పవచ్చు.ఆ సంఘటన జరిగిన తరువాత మెమోరీస్ మొహాన్ని చూస్తే ఆ విషయం పూర్తిగా కనబడుతుంది.
దీంతో పెద్ద ఎత్తున సంజు శాంసన్ కు క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున చురకలు వేస్తున్నారు.అయితే వీటన్నిటికీ తాజాగా సంజు శాంసన్ గట్టి రిప్లై ఇచ్చాడు.
అదే మ్యాచ్ మరో వంద సార్లు జరిగిన తాను ఆ సింగిల్ మాత్రం ఇవ్వనని స్పష్టంగా తెలిపాడు.దీంతో సంజూ శాంసన్ తీసుకున్న నిర్ణయం రాబోయే కాలంలో అతనికి ఎన్ని సమస్యలు తెచ్చి పెడుతుందో అన్న సందేహం అందరికీ మొదలైంది.