సాధారణంగా ట్రాఫిక్ రూల్స్ ని అధికారమిస్తే పోలీసులు జరిమానా విధించి పంపిస్తారు.కానీ ఏకంగా ఓ నటికి పోలీసులు విచారణకి హాజరు కావాలంటూ నోటీసులు పంపించారు ఈ ఘటన బెంగళూరులో చోటు చేసుకుంది.
వివరాలకు వెళితే నిన్నటి రోజున టాలీవుడ్ నటి సంజన గల్రాని బెంగుళూరులోని ఓ ప్రాంతంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని చూడటం కోసం తన కారులో బయలుదేరారు.అయితే ఈ క్రమంలో బెంగళూరులోని ఓ సిగ్నల్ దగ్గర సెల్ఫీ తీసుకుంటూ అలాగే వీడియోను కూడా తీసుకున్నారు.
అయితే ఈ వీడియోను మరియు ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.అయితే ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది కానీ డ్రైవింగ్ చేస్తూ ఫోన్ ని ఉపయోగించి నందు వలన ఆమెకు పోలీసులు నోటీసులు పంపించారు.ఇలా ఎందుకు చేశారని పోలీసులు ప్రశ్నించగా సాధారణంగా మామూలు వ్యక్తులు ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమిస్తే జరిమానా విధించి వదిలేస్తానని కానీ సెలబ్రిటీల ఇలా చేస్తే పరిస్థితిని అదుపు చేయలేమని అందువల్లనే విచారణకి హాజరవ్వాలని నోటీసులు పంపినట్లు పోలీసులు తెలిపారు.అయితే సంజన ఇప్పటికే ఓ ప్రముఖ నిర్మాత పై మద్యం బాటిల్ తో దాడి చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటోంది.