దేశంలో మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది.గత ఏడాది దేశ ప్రజలందరిని భయపెట్టి లక్షలాది మంది ఉపాధి కోల్పోయి సొంత ఊళ్ళ బాట పట్టేలా చేసిన ఈ మహమ్మారికి ప్రస్తుతం వాక్సిన్ వేస్తున్న కూడా మరోసారి రూపం మార్చుకొని మరింత ప్రమాదకరంగా దాడి చేయడానికి రెడీ అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
రోజు రోజుకి దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య చూస్తూ ఉంటే కొంత కలవరపాటు ఉంది.ఇదే సమయంలో సెలబ్రిటీలు ఈ మధ్యకాలంలో మరల కరోనా బారిన పడుతున్నారు.
సినిమా షూటింగ్ లలో ఎక్కువ మందితో కలిసి పనిచేయాల్సి ఉంటుంది.ఇలాంటి వేళ ఎవరు ఎక్కడి నుంచి వస్తారనేది తెలియని పరిస్థితి.
అయినా అందరితో కలిసి పని చేయాలి.ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న రావాల్సిన ప్రమాదం వచ్చేస్తుంది.
కొద్ది రోజుల క్రితం బాలీవుడ్ లెజెండ్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ, రణబీర్ కపూర్ కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే.రీసెంట్ గా తెలంగాణ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి కరోనా బారిన పడ్డారు.
సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కించిన గంగుబాయ్ కథియావాడి సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.ఈ సినిమాలో అలియా భట్ టైటిల్ రోల్ పోషించింది.త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతుంది.ఈ సమయంలో సంజయ్ లీలా బన్సాలీ కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే.
అప్పటి నుంచి ఆయన హోం క్వారంటైన్ లో ఉంటూనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.తాజాగా మరోసారి టెస్ట్ చేసుకోగా కరోనా నెగిటివ్ వచ్చింది.
దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.రెండు వారల హోం క్వారంటైన్ లో ఉన్న తర్వాత సంజయ్ లీలా బన్సాలీ బయటకి వచ్చి గంగుబాయ్ ప్రమోషన్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే నార్త్ ఇండియాలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండటం ఈ సినిమా రిలీజ్ వాliయిదా వేసే అవకాశం ఉన్నట్లు బోగట్టా.