తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ చీఫ్ బండి సంజయ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రాష్ట్రాన్ని కేసీఆర్ సర్వనాశనం చేస్తున్నారని ఆరోపించారు.
గుండెగాం ప్రజల పరిస్థితి చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని తెలిపారు.ఊరు మునిగిపోతున్నా ఎందుకు ఆదుకోవడం లేదని ఆయన నిలదీశారు.
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే గుండెగాంను అద్దంలా మెరిపిస్తామని పేర్కొన్నారు.రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్లినా కష్టాలు, కన్నీళ్లే ఉన్నాయని బండి సంజయ్ వెల్లడించారు.
ఇక్కడి సొమ్మును పంజాబ్ రైతులకు ఇస్తూ ఇక్కడి వాళ్లను గాలికొదిలేస్తారా అని ప్రశ్నించారు.డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రెడీ కాకముందే కురుస్తున్నాయని విమర్శించారు.