మహేష్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న సంజయ్ దత్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ క్యాన్సిల్ కావడంతో ఇప్పుడు అదే కథని మహేష్ బాబుతో చేయడానికి త్రివిక్రమ్ రెడీ అవుతున్నాడని బోగట్టా.

 Sanjay Dutt Villon For Mahesh Babu, Tollywood, Trivikram Srinivas, Pooja Hegde,-TeluguStop.com

ఇప్పటికే మహేష్ కి కథ కూడా నేరేట్ చేయడం జరిగిందని, అతను కూడా ఒకే చెప్పాడని టాక్ నడుస్తుంది.వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి.

అతడు సినిమా హిట్ అయిన ఖలేజా ఫ్లాప్ అయ్యింది.ఈ నేపధ్యంలో ఈ సారి తెరకెక్కించే సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా ఉండాలని త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే, లేదంటే రష్మిక మందనలో ఒకరిని ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం.అలాగే సౌత్ అన్ని బాషలలో ఈ సినిమా ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో మహేష్ బాబుకి ప్రతినాయకుడు పాత్ర కోసం త్రివిక్రమ్ ప్రస్తుతం వేట కొనసాగిస్తున్నారు.ముందు నుంచి అరవింద్ స్వామి, పేరు వినిపించింది.తరువాత మాధవన్ పేరు కూడా పరిశీలించారు.అతను అయితే పెర్ఫెక్ట్ అని భావించారని టాక్ నడిచింది.

అయితే ఇప్పుడు ఈ లిస్టులోకి బాలీవుడ్ కల్నాయక్ సంజయ్ దత్ వచ్చి చేరారు.ఇప్పటికే సంజయ్ దత్ కేజీఎఫ్ లో ప్రధాన ప్రతినాయకుడుగా ఎంట్రీ ఇచ్చారు.

ఈ నేపధ్యంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ అతనిని టాలీవుడ్ కి విలన్ గా పరిచయం చేయాలని భావిస్తున్నట్లు టాక్ నడుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube