సౌత్ ఇండియాలో బాహుబలి తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో సంచలనం నమోదు చేసిన చిత్రం కేజీఎఫ్.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా 90 కోట్లతో నిర్మిస్తే ఏకంగా 250 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.
కన్నడ బాషలోనే ఇండస్ట్రీ రికార్డ్ గా వందకోట్లకి పైగా ఈ సినిమా కలెక్ట్ చేసింది.ఇంత అద్భుతమైన విజయం సొంతం చేసుకున్న ఈ సినిమా సీక్వెల్ కేజీఎఫ్2 ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.
మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుగుతుంది.ఈసారి మరింత భారీ బడ్జెట్ తో ఈ సినిమాని హోంబలే ఫిలిమ్స్ నిర్మాతలు తెరకెక్కిస్తున్నారు.
ఇక ప్రశాంత్ నీల్ కూడా ఈ సినిమా కోసం సౌత్ ఇండియన్ యాక్టర్స్ తో పాటు బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ని మెయిన్ విలన్ అయినా అధీరాగా చూపిస్తున్నారు.అలాగే రవీనాటాండన్ కూడా మరో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ సమయంలో అధీరా పాత్రలో నటిస్తున్న సంజయ్ దత్ క్యాన్సర్ బారిన పడ్డారు.దీంతో వెంటనే చికిత్స తీసుకొని మళ్ళీ ఇండియాకి వచ్చారు.
క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత క్యూర్ అయిన కొంత కాలం శరీరం అస్సలు సహకరించదు.ఈ నేపధ్యంలో అధీరా పాత్ర కోసం డిజైన్ చేసిన యాక్షన్ సన్నివేశాలని మార్చాలని దర్శకుడు ప్రశాంత్ నీల్ నిర్ణయించుకున్నాడు.
అయితే కథలో ఇంటెన్సిటీ తెలిసిన సంజయ్ దత్ మాత్రం క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకొని ఇండియా వచ్చిన వెంటనే షూటింగ్ లో పాల్గొనడమే కాకుండా యాక్షన్ సన్నివేశాలని ఏ మాత్రం మార్చే ప్రయత్నం చేయొద్దని, కథలో ముందుగా రాసుకున్న యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో అలాగే చిత్రీకరించాలని క్లారిటీగా చెప్పినట్లు టాక్.ఈ నేపధ్యంలో అంత కష్టంలో కూడా కష్టమైన యాక్షన్ ఎపిసోడ్స్ ని సంజయ్ దత్ చేసి సినిమా మీద తనకున్న డెడికేషన్ చూపించారని చెప్పుకుంటున్నారు.