బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ కు క్యాన్సర్ అంటూ నిర్థారణ అయిన విషయం తెల్సిందే.దాంతో ఆయన అమెరికాకు కనీసం ఏడాది పాటు ట్రీట్మెంట్ కోసం వెళ్తాడని ఆ సమయంలో ఆయన నటిస్తున్న సినిమాలన్నీ కూడా ఆగిపోవాల్సిందేనేమో అంటూ చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారు.
సౌత్ ఇండియన్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘కేజీఎఫ్ 2’ సినిమా లో సంజయ్ దత్ విలన్గా నటిస్తున్నాడు.ఆ సినిమాకు సంబంధించి సంజయ్ దత్ ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేశాడు.
త్వరలో మొత్తం షూటింగ్ పూర్తి అవుతుంది.అక్టోబర్లో సినిమా విడుదల అవుతుంది అనుకుంటూ ఉండగా సినిమాకు కరోనా అడ్డు వచ్చింది.
దాంతో షూటింగ్ నిలిచి పోయింది.
ఆరు నెలల తర్వాత మళ్లీ షూటింగ్ కు కేజీఎఫ్ సిద్దం అయ్యింది.
ఇటీవలే షూటింగ్ను ప్రశాంత్ నీల్ పునః ప్రారంభించాడు.అయితే ఈ సినిమా షూటింగ్ లో సంజయ్ దత్ పాల్గొనడు కదా అంటూ అంతా అనుకుంటూ ఉండగా అతి త్వరలోనే సంజయ్ దత్ కేజీఎఫ్ 2 ను పూర్తి చేస్తాడంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ఎందుకంటే నిన్నటి నుండి సంజయ్ దత్ షూటింగ్లో పాల్గొంటున్నాడు.హిందీ సినిమా షంషేర్ మూవీ షూటింగ్ కోసం సంజయ్ దత్ ఇంటి నుండి బయటకు వెళ్లాడు.
ఆ సినిమా షూటింగ్ ను త్వరలో నే పూర్తి చేసి ఆ తర్వాత కేజీఎఫ్ ను కూడా మొదలు పెట్టనున్నాడట.
మూడు నాలుగు నెలల్లో తన షూటింగ్స్ మొత్తంను ఫూర్తి చేసి ఆరు నెలల నుండి సంవత్సరం వరకు విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత మళ్లీ షూటింగ్లో జాయిన్ అవ్వాలని భావిస్తున్నాడట.
ఈ విషయంలో ఏదైనా మార్పులు చేర్పులు వస్తాయా అనేది చూడాల్సి ఉంది.అతి త్వరలోనే కేజీఎఫ్ 2 సినిమాను పూర్తి చేసి విడుదల చేయాలనుకుంటున్న ప్రశాంత్ నీల్కు ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు.