బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ క్యాన్సర్తో బాధపడుతున్న విషయం తెల్సిందే.ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్తున్నట్లుగా సంజయ్ దత్ నుండి అఫిషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది.
ప్రస్తుతానికి కాస్త బ్రేక్ తీసుకుంటాను.త్వరలో మళ్లీ మీ ముందుకు వస్తాను, ఎలాంటి ఆందోళన అవసరం లేదు.
పుకార్లు అస్సలు పట్టించుకోవద్దంటూ సంజయ్ దత్ అఫిషియల్గా అనౌన్స్ చేశాడు.దాంతో ఆయన క్యాన్సర్ చికిత్సకు పోయి వచ్చే వరకు ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నీ అలా ఆగిపోవాల్సిందే అంటున్నారు.
ప్రస్తుతం సంజయ్ దత్ సౌత్లో బిగ్గెస్ట్ మూవీగా రూపొందుతున్న కేజీఎఫ్ 2లో అధీరా పాత్రలో నటిస్తున్న విషయం తెల్సిందే.భయంకరమైన విలన్ పాత్రను ఆయన చేస్తున్నాడు.భారీ అంచనాలున్న కేజీఎఫ్ 2 సినిమాకు గాను ఆయన పాత్ర అదనపు ఆకర్షణ అవ్వడం ఖాయం అనుకున్నారు.కాని పరిస్థితి చూస్తుంటే ఆయన వల్ల సినిమా ఆలస్యం అయ్యేలా ఉందనిపిస్తుంది.
సగానికి పైగా పూర్తి అయిన కేజీఎఫ్ 2 ను మరో రెండు నెలల షూటింగ్ చేస్తే పూర్తి అయ్యేది.కాని కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది.
ఇప్పుడు సంజయ్ దత్ అమెరికా నుండి వచ్చే వరకు వెయిట్ చేయాలి అంటే ఎన్ని నెలలు పడుతుందో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.అక్టోబర్లో దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాను పట్టాలెక్కించాలనుకున్నారు.కాని ఇప్పుడు ఆ ఆలోచన క్యాన్సిల్ చేసుకుంటారేమో చూడాలి.బాలీవుడ్లో కూడా ఆయన నటిస్తున్న సినిమాలు ఉన్నాయి.అయితే ఎక్కువ నష్టం మాత్రం కేజీఎఫ్ కే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.దత్ త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో కేజీఎఫ్లో నటించాలని ప్రతి ఒక్కరం కోరుకుందాం.