సౌత్ ఇండియాలో బాహుబలి సినిమా తర్వాత ఆ స్థాయిలో ఇండియన్ వైడ్ గా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిన సినిమా కేజీఎఫ్.యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ఇది తెరకెక్కింది.
ఇక ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏడు బాషలలో రిలీజ్ అయ్యి అన్ని చోట్ల సూపర్ హిట్ అయ్యింది.ఒక్కసారిగా హీరోయష్ ఇమేజ్ కూడా పెరిగిపోయింది.
ఈ సినిమాని కన్నడ ఇండస్ట్రీలో ఇతర హీరోలు అందుకోవాలని ప్రయత్నం చేసిన సాధ్యం కాలేదు.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ సిద్ధమవుతుంది.
ఇప్పటికే ఈ సీక్వెల్ షూటింగ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రారంభించేశాడు.ఇందులో మెయిన్ విలన్ అయిన అధీరా పాత్రలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ఆయన లుక్ కి సంబందించిన ఫోటోలు కూడా రిలీజ్ చేశారు.ఈ ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ సంజయ్ దత్ పార్ట్ కొంత పూర్తయ్యాక లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది.ఇంతలో సంజయ్ దత్ క్యాన్సర్ బారిన పడినట్లు నిర్ధారణ అయ్యింది.
ఈ నేపధ్యంలో ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్న అతను కేజీఎఫ్ 2లో నటించడంపై నీలినీడలు కమ్ముకున్నాయి.అయితే చిత్ర యూనిట్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.
కచ్చితంగా సంజయ్ దత్ ఇందులో నటిస్తాడని స్పష్టం చేశారు.అనుకున్నట్లుగానే సంజయ్ దత్ కేజీఎఫ్ షూటింగ్ లో పాల్గొన్నారు.
ఒక ప్రక్క తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంజయ్ దత్ షూటింగ్స్ లో పాల్గొన్నారట.ఆయన ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు షూటింగ్ పూర్తి చేసి పూర్తిస్థాయి ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తుంది.
మొత్తానికి తీవ్ర అనారోగ్యంతో ఉన్న కూడా నటుడుగా సంజయ్ దత్ తన డెడికేషన్ చూపిస్తున్నారని తెలుస్తుంది.