ప్రపంచ దేశాల్లో రోజురోజుకు క్యాన్సర్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.జన్యువులు కొన్ని క్యాన్సర్లకు కారణమైతే జీవనశైలి వల్లే మిగతా క్యాన్సర్లు వస్తున్నాయి.
ఇప్పటికే ఎందరో సినీ ప్రముఖులు క్యాన్సర్ బారిన పడగా కొంతమంది సినీ ప్రముఖులు వైద్య చికిత్స ద్వారా క్యాన్సర్ ను జయిస్తే మరి కొంతమంది సినీ ప్రముఖులు మాత్రం క్యాన్సర్ ను జయించలేక మరణించారు.గతేడాది ఆగష్టు నెలలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ క్యాన్సర్ బారిన పడ్డారు.
ఆగష్టు నెలలో ఊపిరితిత్తుల క్యాన్సర్ నాలుగో స్టేజ్ లో ఉందని సంజయ్ దత్ కు నిర్ధారణ అయింది.క్యాన్సర్ అని తెలిశాక విదేశాలకు వెళ్లి చికిత్స చేయించుకున్న సంజయ్ దత్ క్యాన్సర్ ను జయించారు.
అయితే క్యాన్సర్ అని తెలిసిన తరువాత సంజయ్ దత్ బాంద్రాలోని పాల్ హిల్ దగ్గర ఉన్న నాలుగు అపార్టుమెంట్లను బహుమతిగా రాసిచ్చేశాడని తెలుస్తోంది.భార్య మాన్యతా దత్ పేరుపై ఈ అపార్టుమెంట్లను సంజయ్ దత్ రిజిస్ట్రేషన్ చేయించాడు.
ఈ నాలుగు అపార్టుమెంట్ల విలువ 27 కోట్ల రూపాయలని తెలుస్తోంది.మాన్యత ఒరిజినల్ నేమ్ దిల్నాషిన్ దత్ కాగా ఆ పేరుతోనే ఫ్లాట్లు అన్నీ రిజిష్టర్ అయ్యాయని తెలుస్తోంది.ఈ అపార్టుమెంట్లు సంజయ్ కు తండ్రి వారసత్వంగా రాగా వాటిని గిఫ్ట్ డీడ్ గా ఇచ్చారు.మరోవైపు సంజయ్ దత్ కేజీఎఫ్ ఛాప్టర్ 2లో కీలక పాత్రలో నటిస్తున్నారు.
సంజయ్ దత్ అధీరా పాత్రలో నటిస్తుండగా ఈ పాత్ర వల్ల సినిమాపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
కేజీఎఫ్ ఛాప్టర్ 2లో యశ్ హీరోగా నటిస్తుండగా సినిమాలో యశ్ తరువాత ఆ స్థాయి పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్నారు.
ప్రభాస్ సినిమాలో సంజయ్ దత్ కు ఆఫర్లు వస్తుండగా సంజయ్ దత్ ఆ ఆఫర్ కు అంగీకరిస్తాడో లేదో తెలియాల్సి ఉంది.