బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్ లంగ్స్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.అత్యవసరంగా ఆయన్ను ముంబయిలోని ప్రముఖ ఆసుపత్రిలో జాయిన్ చేశారు.
ఆయన ఆరోగ్యం క్షీణించిందంటూ వార్తలు వచ్చాయి.ఆయనకు కరోనా అనే ప్రచారం కూడా జరిగింది.
రకరకాలుగా ప్రచారం జరగడంతో అభిమానులు మరియు బాలీవుడ్ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేశారు.సంజయ్ దత్ ఆరోగ్యం గురించి సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.
ఈ సమయంలోనే ఆయన ఆరోగ్యంగా బయట పడ్డాడు అంటూ అధికారిక ప్రకటన వచ్చింది.
జనాలు ఊహించినట్లుగా మీడియాలో వార్తలు వచ్చినట్లుగా సంజయ్ దత్ కు కరోనా పాజిటివ్ రాలేదు.
ఆయనకు పరీక్షలు నిర్వహించగా నెగటివ్ వచ్చింది.కాని ఆయన లంగ్స్ లో వాటర్ చేరడం వల్ల ఊపిరి తీసుకోవడం సమస్యగా మారింది.
దానికి తోడు వాతావరణం ఒక్కసారిగా మారడం వల్ల కూడా ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అంటూ వైధ్యులు పేర్కొన్నారు.కేవలం ఒకే ఒక్క రోజు ఆసుపత్రిలో సంజయ్ దత్ ఉన్నాడు.
వెంటనే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన సంజయ్ దత్ ఫ్యాన్స్కు అభివాదం చేసుకుంటూ అక్కడ నుండి వెళ్లి పోయాడు.ప్రస్తుతం బాలీవుడ్లో పలు చిత్రాలు చేస్తుండటంతో పాటు కేజీఎఫ్ 2 చిత్రంలో కూడా భయంకరమైన అధీరా పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్న విషయం తెల్సిందే.
అంచనాలు భారీగా ఉన్న కేజీఎఫ 2 చిత్రం వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.మొదటి పార్ట్ రికార్డు బద్దలు కొట్టడంతో రెండవ పార్ట్పై సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.