సౌత్ లో హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటి సంజనా గల్రానీ.ఈ అమ్మడు హీరోయిన్ గా ఎంత గుర్తింపు సొంతం చేసుకుందో అనే విషయం పక్కన పెడితే ఎప్పటికప్పుడు వివాదాలతో ఈ అమ్మడు ఎక్కువగా మీడియా దృష్టిని ఆకర్షిస్తుంది.
లాక్ డౌన్ కాలంలో ఈ అమ్మడు బెంగుళూరులో డ్రగ్స్ ర్యాకెట్ లో అడ్డంగా బుక్ అయ్యింది.డ్రగ్స్ ఫ్లీడర్ గా మారి మాదక ద్రవ్యాల సరఫరాలో సంజనా కీలకంగా మారిందని, చాలా మంది వీఐపీలకి, సెలబ్రిటీలకి ఈ భామ డ్రగ్స్ సప్లైయ్ చేస్తుందని ఆరోపణలతో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతరం ఏకంగా రెండు నెలలకి పైగా ఆమె జైలు జీవితం అనుభవించింది.ఈ ఘటనతో ఒక్కసారిగా సంజనా పేరు దేశవ్యాప్తంగా పాపులర్ అయిపొయింది.
అయితే ఈ డ్రగ్స్ కేసులో తనని అన్యాయంగా ఇరికించారని గగ్గోలు పెట్టిన ఆధారాలు పక్కాగా ఉండటంతో ఆమె జైలులో ఉండక తప్పలేదు.
ఇదిలా ఉంటే బెయిల్ మీద బయటకి వచ్చిన ఈ భామ కొద్ది రోజులు నిశ్శబ్దంగా ఉండి ఇప్పుడు మీడియా ముందుకి వచ్చింది.
తనపై వచ్చిన డ్రగ్స్ ఆరోపణలు, అలాగే పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది.అలాగే సినిమా కెరియర్ పై కూడా స్పష్టం చేసింది.తాను ఇష్ట ప్రకారమే ఇస్లాం మతం స్వీకరించానని మతం మారాలని తనను ఎవ్వరూ బలవంతం చెయ్యలేదని నటి సంజనా వివరణ ఇచ్చింది.లాక్ డౌన్ సమయంలో డాక్టర్ అజీజ్ తో తన నిశ్చితార్థం జరిగిందని ఆ విషయం తన స్నేహితులకు తెలుసని సంజనా తెలియజేశారు.
త్వరలో అతనిని పెళ్లి చేసుకోబోతున్నట్లు స్పష్టం చేసింది.తాను అన్ని మతాల్ని గౌరవిస్తానని సంజన అన్నారు.
జైలు జీవితంలో కష్టాల్ని పరిచయం చేసిందని, న్యాయస్థానం మీద తనకు పూర్తి నమ్మకం ఉందని నిర్దోషిగా కచ్చితంగా బయటపడతానని తెలిపింది.ఇకపై సినిమాలు వెబ్ సిరీస్ లతో బిజీ అవుతానని కెరీర్ పై దృష్టి సారిస్తానని కూడా సంజన వెల్లడించారు.
చేతిలో ఉన్న కన్నడ-తమిళ చిత్రాల్ని పూర్తి చేసిన తరువాత హిందీలో ఓ వెబ్ సిరీస్ చేస్తానని, కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని తెలిపారు.