ఇలాంటి సమయంలో అలాంటి పనులు ఏంటంటున్న సానియా....

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఇటీవల కాలంలో  సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గా ఉంటోంది.అయితే ఇందులో భాగంగా ప్రస్తుత సమాజంలో జరిగేటువంటి కొన్ని సమస్యలు మరియు విషయాల గురించి అప్పుడప్పుడు తన అభిమానులతో చర్చించడం మరియు పంచుకోవడం వంటివి చేస్తుంటారు.

 Sania Mirza, Star Tennis Player, Indian Tennis Player, Celebrity Coocking Videos-TeluguStop.com

అయితే  కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం దేశంలోని సెలబ్రిటీలు మరియు ప్రముఖులు అందరు కూడా లాక్ డౌన్ పాటిస్తూ తమ ఇళ్ల కే పరిమితమైన సంగతి అందరికీ తెలిసిందే.

అయితే ఇందులో భాగంగా కొందరు సినీ ప్రముఖులు మరియు సెలబ్రిటీలు వంటల వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నారు.

దీంతో ఈ విషయంపై తాజాగా సానియామీర్జా స్పందించింది.అయితే ఇందులో భాగంగా మీ వంటా-వార్పు వీడియోలు పూర్తయ్యాయా అంటూ ప్రశ్నించింది.అంతేగాక కరోనా వైరస్ వల్ల ప్రస్తుతం చాలామంది తిండి తిప్పలు లేక అల్లాడుతున్నారని ఇలాంటి సమయంలో వీడియోలు అవసరమా అంటూ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేసింది.దీంతో పలువురు నెటిజనులు ఈ ట్వీట్ ని తెగ వైరల్ చేస్తున్నారు.

అలాగే మరికొందరు సానియా మీర్జా ట్వీట్ కి మద్దతు తెలియజేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటివరకు నమోదయిన వైద్య గణాంకాల ప్రకారం భారతదేశంలో దాదాపుగా నాలుగు వేలకి పై చిలుకు మంది ఈ వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు.

అయితే ఇందులో దాదాపుగా 100 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం.అంతే గాక ఇందులో 261 మంది ఈ కరోనా బారినుంచి కోలుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube