టెన్నిస్ క్రీడలో భారతదేశానికి గోల్డ్ మెడల్స్ తెచ్చినటువంటి స్టార్ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా గురించి తెలియని వారు ఉండరు.అయితే తాజాగా ఈ అమ్మడు గురించి ఓ వార్త నెట్లో తెగ వైరల్ అవుతోంది.
అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే ఈ అమ్మడు అప్పట్లో బాలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి ఓ హీరోతో ప్రేమాయణం నడిపిందని పలు వార్తలు బాగానే వినిపిస్తున్నాయి.
అయితే ఇంతకీ విషయం ఏంటంటే ఇటీవల కాలంలో ఈ అమ్మడు కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొంది.
ఇందులో భాగంగా కరణ్ జోహార్ గతంలో మీరు బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తో డేటింగ్ చేశారనే వార్తలు బలంగా వినిపించాయి ఇంతకీ ఆ వార్తలు నిజమేనా అంటూ సూటి ప్రశ్న సంధించాడు.అయితే ఈ ప్రశ్నకి సానియామీర్జా సమాధానం చెబుతూ తనకు అసలు షాహిద్ కపూర్ తో డేటింగ్ జరిగిన ఆ విషయమే గుర్తు రావడం లేదంటూ దాటవేసే ప్రయత్నం చేసింది.
అంతేగాక మళ్లీ ఇప్పుడు ఆ పాత రోజులు గుర్తు చేసుకోవడం ఎందుకు అంటూ సరదాగా నవ్వించింది.
అయితే తన పెళ్లయిన తర్వాత టెన్నిస్ ఆటకి దూరం అయినటువంటి సానియా మీర్జా మళ్లీ తన ఆటతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.ఈ క్రమంలో ఇప్పటికే ఓ బిడ్డకు జన్మనిచ్చిన టువంటి సానియా మీర్జా బరువు బాగా పెరగడంతో బరువు ప్రస్తుతం బరువు తగ్గేందుకు బాగానే శ్రమిస్తోంది.ఇందులో భాగంగా ఇటీవలే దాదాపుగా మూడు నెలలపాటు కష్టపడి 20 కిలోల వరకూ తగ్గింది.