టైమ్స్ ఆఫ్ హైదరాబాద్ నిర్వహించిన మోస్ట్ డిజైరబుల్ స్టార్స్లో తెలుగు హీరో రానా మొదటి స్థానం దక్కించుకున్న విషయం తెల్సిందే.మహేష్బాబు, ప్రభాస్లను వెనక్కు తోసేసి మరీ రానా ముందుకు వచ్చాడు.ఇక హీరోయిన్స్ అందరిని కూడా పక్కన పెట్టి టెన్నీస్ స్టార్ సానియా మీర్జా మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ జాబితాలో నెం.1 స్థానం దక్కించుకుంది.సాదారణంగా క్రీడాకారిణికి మోస్ట్ డిజైరబుల్గా ఎంపిక కారు.కాని హీరోయిన్స్ను అందరిని పక్కన పెట్టి ఈసారి టెన్నీస్స్టార్ సానియా మీర్జా నిలిచింది.
హైదరాబాద్ పాఠకులు సానియా మీర్జాకు ఎక్కువ ఓట్లు వేసినట్లుగా సదరు పత్రిక పేర్కొంది.సానియా మీర్జా తర్వాతి స్థానంలో హీరోయిన్ శ్రియ శరన్ నిలిచింది.
మూడవ స్థానంలో అనుష్క, నాల్గవ స్థానంలో శృతిహాసన్, అయిదవ స్థానంలో పూజా హెగ్డే నిలిచింది.టాప్ 5లో సమంత, తమన్నాలు స్థానం దక్కించుకోక పోవడం విశేషం.
గత సంవత్సరం మోస్ డిజైరబుల్ ఉమెన్ జాబితాలో 11వ స్థానంలో నిలిచిన సానియా ఈసారి ఏకంగా మొదటి స్థానంలో నిలిచింది.