అర్జున్ రెడ్డి సినిమాకు ముందు తెలుగు సినిమాలో ఒక్క లిప్ లాక్ సీన్ ఉంటే బాబోయ్ అందులో ముద్దు సీన్ ఉందట.అది కూడా లిప్ లాక్ సీన్ అంటా అంటూ చర్చించుకునే వారు.
కాని ప్రస్తుత పరిస్థితి పూర్తిగా మారింది.ముఖ్యంగా అర్జున్ రెడ్డి తర్వాత పరిస్థితి మారింది.
ట్రెండ్ సెట్టర్గా నిలిచిన అర్జున్ రెడ్డిని సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించాడు.ఆ సినిమాలో విజయ్ దేవరకొండ హీరోయిన్ షాలిని పాండే మద్య ముద్దు సీన్స్ హద్దులు దాటాయి.
అర్జున్ రెడ్డితో రొమాన్స్ విషయంలో ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి ఇప్పుడు వెబ్ సిరీస్ను చేసేందుకు సిద్దం అవుతున్నాడట.హిందీలో అర్జున్ రెడ్డిని తెరకెక్కించిన తర్వాత ఈయనకు అక్కడ ఇక్కడ చాలా ఆఫర్లు వచ్చినట్లుగా అనిపించినా కూడా ఏ ఒక్కటి ఫైనల్ కాలేదు.
ఇక త్వరలో ఏదో ఒక చిత్రంను ప్రారంభిస్తాడు అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా కరోనా వచ్చి పడినది.
కరోనా కారణంగా స్టార్స్ ఎవరు ఈ ఏడాది వరకు సినిమాలు చేసే మూడ్ లో లేరు.
కనుక చాలా మంది స్టార్ డైరెక్టర్స్ వెబ్ సిరీస్లను తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.త్వరలోనే సందీప్ రెడ్డి వంగ కూడా వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
సినిమాలోనే బూతు చూపించిన సందీప్ సెన్సార్ ఉండని వెబ్ సిరీస్ను ఏ స్థాయిలో చూపిస్తాడో కదా అంటూ అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.