అర్జున్ రెడ్డి సినిమాతో అందరి దృష్టిని ఒక్కసారిగా తనవైపకి తిప్పుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.ఈ ఒక్క సినిమాతో సందీప్ మోస్ట్ ఫేమస్ అయిపోయాడు.
స్టార్ హీరోలని సైతం తన మేకింగ్ స్టైల్ తో మెప్పించి ఫోన్ చేసి కథలు సిద్ధం చేయమని చెప్పే స్థాయికి వచ్చేశాడు.అలాగే నిర్మాతలు కూడా అడ్వాన్స్ లు పట్టుకొని అతని వద్దకి క్యూ కట్టారు.
అయితే సందీప్ మాత్రం వెంటనే ఎవరికీ ఒకే చెప్పకుండా అర్జున్ రెడ్డిని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేశాడు.తెలుగులో కంటే హిందీలో ఈ సినిమా మరింత సూపర్ హిట్ అయ్యింది.
ఒక్కసారిగా షాహిద్ కపూర్ ఇమేజ్ మారిపోయింది.ఇప్పుడు బాలీవుడ్ లో షాహిద్ కపూర్ నెక్స్ట్ సినిమాలకి 50 కోట్లు వరకు తీసుకునే స్థాయికి వచ్చేశాడు.
జెర్సీ రీమేక్ కి అతను కెరియర్ లోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్నాడు.ఇదిలా ఉంటే.
కబీర్ సింగ్ తో సందీప్ క్రేజ్ కూడా బాలీవుడ్ లో పెరిగిపోయింది. అయితే నెక్స్ట్ సినిమా విషయంలో మాత్రం ఎందుకనో కొంత గందరగోళానికి గురవుతున్నాడు.
ఈ నేపధ్యంలో తాజాగా అతను ఓ కీలక నిర్ణయం తీసుకున్నాడు.ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇకపై తన దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలకి తానే నిర్మాతగా ఉంటానని స్పష్టం చేశాడు.
ఇతర నిర్మాతలతో సినిమాలు చేస్తే క్రియేటివ్ ఫ్రీడమ్ దొరకడం లేదని అన్నాడు.అందుకే తన సినిమాలకి తానే నిర్మాతగా ఉంటే మరింత ఎక్కువగా క్రియేటివ్ గా ఆలోచించే అవకాశం దొరుకుతుందని చెప్పుకొచ్చాడు.
అయితే అతను ఒకే సినిమాని రెండు సార్లు తీసాడు.తెలుగు అర్జున్ రెడ్డికి అతనే నిర్మాత, బాలీవుడ్ లో వేరొక నిర్మాతగా పని చేశాడు.
ఇవి కాకుండా ఏ సినిమా విషయంలో అతనికి క్రియేటివ్ ఫ్రీడమ్ దొరకలేదు అనేది అర్ధం కానీ విషయంగా ఉందని నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.