మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.పరశురామ్ దర్శకత్వం లో ఈ సినిమా తెరకెక్కుతుంది.
మహేష్ బాబు 27 వ సినిమాగా సర్కారు వారి పాట రూపొందుతుంది.ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది.
ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలొకొన్నాయి.ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాను పరశురామ్ సోషల్ మెసేజ్ తో తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.మహేష్ బాబు ఈ సినిమాలో బ్యాంకు మేనేజర్ కొడుకుగా నటిస్తున్నాడు.చాలా రోజుల తర్వాత మహేష్ బాబు రొమాంటిక్ లవర్ బాయ్ గా నటిస్తున్నాడు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేయబోతున్నారు.
అయితే మహేష్ ఈ సినిమా తర్వాత చేయబోయే సినిమా కోసం చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి.ఇప్పటికే రాజమౌళి, మహేష్ కాంబినేషన్ లో సినిమా రాబోతుందని తెలిసింది.
అయితే ఈ సినిమా ముందు మొదలవుతుందా లేక వేరే డైరెక్టర్ తో సినిమా చేస్తాడా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.అయితే మహేష్ ను సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేయబోతున్నట్లు టాక్.
అయితే సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేయబోయేది సినిమా కాదట.మహేష్ బాబు నటించే ఒక యాడ్ ను సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేయబోతున్నాడట.ఈ యాడ్ షూట్ కేవలం ఒక్కరోజు మాత్రమే ఉండబోతుంది.ఇంతకు ముందు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుందని గుసగుసలు వినిపించాయి.అయితే ఇప్పుడు వీరు కలిసి యాడ్ చేయబోతున్నారు కాబట్టి అప్పటిలో వచ్చిన ఆ రూమర్ ను నిజం చేస్తారేమో చూడాలి.