టాలీవుడ్ లో మంచి టాలెంటెడ్ యాక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో సందీప్ కిషన్.నటుడుగా సందీప్ కిషన్ ఒకే అనిపించుకున్న హీరోగా మాత్రం సరైన కమర్షియల్ సక్సెస్ లు అందుకోవడం పూర్తిగా విఫలం అవుతున్నాడు.
ఆ మధ్య వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో కెరియర్ లో మొదటి సారి సూపర్ సక్సెస్ అందుకున్న సందీప్ కిషన్ మళ్ళీ వరుస ఫ్లాప్ ల తర్వాత నిను వీడని నీడను నేనే అంటూ సక్సెస్ కొట్టాడు.ఆ సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించి పర్వాలేదనిపించుకున్నాడు. మరల వరుసగా ఫ్లాప్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.సందీప్ కిషన్ చివరిగా తెనాలి రామకృష్ణ బిఏ బీఎల్ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.తాజా A1 ఎక్స్ ప్రెస్ తో ప్రేక్షకుల ముందుకి రావడానికి రెడీ అవుతున్నాడు.ఇది తమిళ సూపర్ హిట్ మూవీకి రీమేక్.
తాజాగా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ ఇంకా పది రోజులు మాత్రమే పెండింగ్ లో ఉంది.ఇందులో మొదటి సారి సిక్స్ ప్యాక్ లుక్ లో కనిపించబోతున్న.
అవుట్ పుట్ చూసిన తరువాత ఈ సినిమాపై నాకున్న నమ్మకం మరింత పెరిగింది.నాకు జోడీగా లావణ్య త్రిపాఠి నటిస్తుండగా, కీలకమైన పాత్రలో మురళీ శర్మ కనిపించనున్నారు.
లాక్ డౌన్ తరువాత రెండు కొత్త ప్రాజెక్టులను గురించి చెబుతాను అని అన్నాడు.మొత్తానికి సందీప్ కిషన్ ఈ సినిమా మీద ఎన్నో హోప్స్ పెట్టుకున్నాడని అతని మాటల బట్టి తెలుస్తుంది.
మరి అతని నమ్మకాన్ని నిలబెట్టే విధంగా సినిమా ఎంత వరకు సక్సెస్ అందుకుంటుందో చూడాలి.