మన్సాస్ ట్రస్ట్ చైర్పర్సన్గా బాధ్యతలు తీసుకున్న సంచైత మీడియా ముందుకు వచ్చారు.తన కుటుంబ సభ్యులే తనపై ఇలాంటి విమర్శలు చేయడం చాలా బాధకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రస్తుతం తాను ఏమతంలో ఉన్నా కూడా మన్సాస్ ట్రస్ట్ను కాపాడే బాధ్యతను నేను తీసుకుంటాను అంటూ అభిప్రాయం వ్యక్తం చేసింది.నా కుటుంబ సభ్యులే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది.
నేను హిందువును అయితే చర్చికి మసీదుకు వెళ్ల కూడదు అని ఏమైనా ఉందా అంటూ ప్రశ్నించింది.తన నియామకంను ఎవరైనా కోర్టులో సవాల్ చేస్తే నేను ఖచ్చితంగా పోరాడతాను అంది.
ఇక ఈమె వైకాపాలో అధికారికంగా చేరడం ఖాయం అయ్యింది.వైకాపా ప్రభుత్వం ఈమెను మెల్లగా లాగేందుకే ఈ పదవి ఆశ చూపినట్లుగా ప్రచారం జరుగుతోంది.
జగన్ నిర్ణయంతో రాజకీయ ప్రత్యర్థులు చిత్తు అయ్యారంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.