పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలని లైన్ లో పెట్టారు.ఇందులో భాగంగా ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాని పూర్తి చేయబోతున్నారు.
ఈ సినిమా ముగింపు దశలో ఉంది.ఇదిలా ఉంటే ఇప్పుడు పవర్ స్టార్ నెక్స్ట్ సినిమాని కూడా అఫీషియల్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.
వకీల్ సాబ్ పూర్తి చేసిన వెంటనే అయ్యప్పన్ కోషియమ్ సినిమా రీమేక్ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు.సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని పవన్ కళ్యాణ్ కొబ్బరికాయ కొట్టి లాంచ్ చేశారు.
మల్టీ స్టారర్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా మరో హీరోగా కనిపించబోతున్నాడు.మల్టీ స్టారర్ కాంబినేషన్స్ ఎక్కువగా చేస్తున్న రానా కెరియర్ లో పవర్ స్టార్ తో కలిసి చేయడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.
జనవరి 2 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది.స్టార్ దర్శకులు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడం కోసం వేచి చూస్తారు.
అలాంటిది ఏకంగా మూడో సినిమానే పవన్ కళ్యాణ్, రానా లాంటి స్టార్స్ ని హ్యాండిల్ చేసే అవకాశం ఈ సినిమాతో సాగర్ చంద్రకి వచ్చింది.
అయితే ఈ సినిమాని వెనకుండి త్రివిక్రమ్ శ్రీనివాస్ నడిపిస్తున్నాడు.
స్క్రీన్ ప్లే సహకారం అందించడంతో పాటు అయ్యప్పన్ సినిమాకి మాటలు కూడా త్రివిక్రమ్ అందిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా సాయి పల్లవి, రానాకి జోడీగా ఐశ్వర్య రాజేష్ ని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో రానా తండ్రి పాత్రలో కోలీవుడ్ స్టార్ నటుడు సముద్రఖనిని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.ఇందులో రానా తండ్రి పాత్రకి కూడా చాలా ప్రాధాన్యత ఉంది.
ఈ నేపధ్యంలో గుర్తింపు ఉన్న నటుడు అయితే బెటర్ అని అతన్ని ఫైనల్ చేశారు.త్రివిక్రమ్ అతనిని ఆ పాత్ర కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.