టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారీ వారి పాట చిత్రంతో బిజీగా ఉన్నారు.బ్యాంకు చుట్టూ జరిగే అవినీతిని తెలియజేస్తూ ఒక సందేశాత్మక చిత్రంగా ఈ చిత్రం రాబోతోంది.
ఈ చిత్రం ద్వారా మరోసారి బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని మహేష్ బాబు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్ లో మహేష్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తూ అభిమానులను సందడి చేశారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు శరవేగంగా జరుపుకుంటుంది.ఇప్పటికే మొదటి షెడ్యూల్ దుబాయ్ లో పూర్తి కాగా రెండవ షెడ్యూల్ హైదరాబాద్ లో పూర్తి చేసుకున్నారు.
ఇక తాజాగా మూడో షెడ్యూల్ గోవాలో పూర్తిచేసుకుని తిరిగి వచ్చిన మహేష్ బాబు హైదరాబాద్ లో నాలుగో షెడ్యూల్ చిత్రీకరణతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం నాలుగవ షెడ్యూలో విలన్ పాత్రలో నటిస్తున్న టువంటి సముద్రఖని పాల్గొనబోతున్నారు.
ఈ షెడ్యూల్ లో భాగంగా కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
ఈ షెడ్యూల్ లో భాగంగా డైరెక్టర్ మహేష్ బాబుతో ఫైట్ కి రెడీ అయ్యే ఒక ఎపిసోడ్ ని కూడా షూట్ చేయబోతున్నట్లు ఇండస్ట్రీ సమాచారం.ప్రస్తుతం శరవేగంగా పనులను జరుపుకొని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.ఇకపోతే ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎస్.ఎస్ తమన్ సంగీతం సమకూరుస్తున్నారు.