టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత భారీ బడ్జెట్ తో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో హీరోలుగా నటిస్తుండగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమాలో కీలక పాత్రలో ప్రముఖ దర్శకుడు, నటుడు సముద్రఖని నటిస్తున్నారు.అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో ఛాన్స్ రావడం వెనుక అసలు విషయాన్ని సముద్రఖని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అల వైకుంఠపురములో, క్రాక్ సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించిన సముద్రఖని తనకు చాలా సంవత్సరాల నుంచి రాజమౌళితో పరిచయం ఉందని అన్నారు.శంభో శివ శంభో సినిమా విడుదలైన సమయంలో రాజమౌళి ఆ సినిమాకు డైరెక్షన్ బాగా చేశానంటూ ప్రశంసించారని తెలిపారు.ఆ విధంగా తనకు, రాజమౌళికి మధ్య 11 సంవత్సరాల నుంచి స్నేహం ఉందని సముద్రఖని అన్నారు.
మరోవైపు సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన సినిమాలన్నీ హిట్టవుతూ ఉండటం గమనార్హం.
దర్శకునిగా, నటునిగా సముద్రఖని రోజురోజుకు అభిమానులను మరింత చేరువవుతూ ఉండటం గమనార్హం.విలన్ల కొరతను ఎదుర్కొంటున్న టాలీవుడ్ కు సముద్రఖని రూపంలో మంచి విలన్ దొరికాడని చెప్పవచ్చు.
మరోవైపు ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తయ్యే అవకాశం ఉంది.
సంక్రాంతి పండుగకు ఆర్ఆర్ఆర్ నుంచి ఎలాంటి సర్ప్రైజ్ లేకపోయినా రిపబ్లిక్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ నుంచి మరో టీజర్ విడుదల కానుందని తెలుస్తోంది.ఈ ఏడాది దసరా పండుగకు ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం.ఇప్పటికే ఈ సినిమాలోని కీలకమైన సన్నివేశాలను రాజమౌళి చిత్రీకరించారని తెలుస్తోంది.
ఇప్పటికే రెండుసార్లు రిలీజ్ డేట్ వాయిదా పడటంతో ఈసారి పక్కాగా ప్లాన్ చేసుకుని రిలీజ్ డేట్ ప్రకటించాలని చిత్రయూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
.