తమిళంలో డైరక్టర్ గా సత్తా చాటిన సముద్రఖని తెలుగులో నటుడిగా మంచి అవకాశాలను అందుకుంటున్నాడు.అల వైకుంఠపురములో, క్రాక్ సినిమాల్లో విలన్ గా నటించిన సముద్రఖని ఆ రెండు సినిమాల హిట్లతో వరుస ఛాన్సులు అందుకుంటున్నాడు.
ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ తో పాటుగా మహేష్ సర్కారు వారి పాట గోపీచంద్ బాలకృష్ణ కాంబో సినిమాలో కూడా ఛాన్స్ అందుకున్నాడు సముద్రఖని.అంతేకాదు మరో ఇద్దరి స్టార్ హీరోల సినిమాల్లో కూడా నటిస్తున్నట్టు టాక్.
ఇక డిమాండ్ ఉంది కాబట్టి సముద్రఖని సినిమా సినిమాకు తన రెమ్యునరేషన్ కూడా పెంచేస్తున్నట్టు టాక్.ఇప్పటి వరకు సినిమాకు రోజుల వారిగా రెమ్యునరేషన్ తీసుకున్న సముద్రఖని తాను కూడా స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడని భావించి సినిమా మొత్తం కలిపి రెమ్యునరేషన్ మాట్లాడుకుంటున్నాడట.
తెలుగులో సముద్రఖని డిమాండ్ బాగానే ఉందని చెప్పొచ్చు.తప్పకుండా సముద్రఖని మరో ఐదేళ్ల పాటు టాలీవుడ్ లో సత్తా చాటుతాడని అనిపిస్తుంది.తెలుగులో టాలెంట్ చూపిస్తూ సముద్రఖని మంచి అవకాశాలను అందుకుంటున్నాడని చెప్పొచ్చు. వరుస ఛాన్సులు వస్తున్నాయి కాబట్టి సముద్రఖని రెమ్యునరేషన్ విషయంలో కూడా భారీ డిమాండ్ చేస్తున్నాడని తెలుస్తుంది.