ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వల్ల చిత్ర పరిశ్రమ కుదేలైంది.లాక్ డౌన్ కారణంగా సినీ వర్గానికిక సంబంధించి మొత్తం ఇళ్లకే పరిమితమయ్యారు.
అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం కావడంతో ఇప్పటికే కొందరు దర్శకులు ఖాళీ సమయంలో స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు.సినిమాకు తగిన హీరోలను కూడా సెలెక్ట్ చేసుకుంటున్నారు.
కరోనాకు పూర్తిస్థాయిలో వాక్సిన్ అందుబాటులో వచ్చేంతవరకూ థియేటర్లు తెరుచుకోవనే విషయం అందరికి తెలిసిందే.ఈ సినీ పరిశ్రమ నిర్మాతలు కూడా ఆన్ లైన్ ప్లాట్ ఫాంలో సినిమాలను రిలీజ్ చేయడానికి ముందుకు వస్తున్నారు.
అయితే కరోనా మహమ్మారిపై సినీ పరిశ్రమలు ఇప్పటికే పలు సినిమాలు రూపొందిస్తున్నారు. తెలుగులో జాంబీ రెడ్డి టైటిల్ తో ప్రశాంత్ వర్మ ఓ సినిమాను దర్శకత్వం వహిస్తున్నాడని తెలిసిందే.
అయితే తాజాగా బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా కరోనా వైరస్ ఆధారంగా సినిమా తీసే ప్లాన్ లో ఉన్నాడంట.ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, త్వరలోనే ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన వెలువడనుంది.
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు ఇప్పటివరకు హృదయ కాలేయం, కొబ్బరి మట్ట, సింగం 123 వంటి కామెడీ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలను తీసి ప్రేక్షకులను అలరించారు.అయితే కరోనాపై తీసే ఈ చిత్రాన్ని సంపూ స్పూఫ్ ఎంటర్ టైనర్ గా తీస్తారా లేదా సీరియస్ డ్రామాగా తీస్తారా అనేది తెలియాల్సి ఉంది.
గతంలో కొబ్బరి మట్ట సినిమా తీసి సంపూ నెక్ట్ ప్రాజెక్ట్ మూవీ ఏంటనే విషయంపై ఇప్పటికి క్లారిటీ ఇవ్వలేదు.కరోనా మహమ్మారి కారణంగా వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.అన్ని పరిశ్రమలు ఆర్థికంగా కుంగిపోయాయి.
కరోనా వారియర్స్ సేవలు, కుటుంబాలు పడుతున్న బాధల గురించి అందరికి తెలిసిందే.అయితే ఈ మహమ్మారిపై బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ ఏ కోణం లో సినిమా తీస్తారనేది వేచి చూడాల్సిందే.