మీకు బాగా గుర్తుంటే, అత్తారింటికి దారేది సినిమా పూర్తవగానే గబ్బర్ సింగ్ కి సీక్వెల్ అన్నౌన్స్ చేశారు.పవన్ కళ్యాణ్ ఈ సినిమాని సొంతంగా నిర్మిస్తారని, దీనికి సంపత్ నంది దర్శకుడు అని వార్తలు వచ్చాయి గుర్తుందా? పాపం సంపత్ నంది … గబ్బర్ సింగ్ సీక్వెల్ కోసం తన శైలిలో ఒక స్క్రిప్టు కూడా రాసుకున్నాడు.దాదాపు రెండు సంవత్సరాలు పవన్ కోసం ఎదురుచూశాడు.చివరకి ఏమైంది ? సంపత్ నందికి హ్యాండ్ ఇచ్చాడు పవన్
గబ్బర్ సీక్వేల్ నుంచి సంపత్ నంది పోయి, బాబి వచ్చి చేరాడు.చేసేదేమి లేక, రవితేజతో బెంగాల్ టైగర్ తీసాడు సంపత్.ఆ సినిమా కూడా మోస్తరుగా ఆడిందండోయ్
మరోవైపు బాబి భారి పరాజయాన్ని అందుకున్నాడు.
అట్లాంటి, ఇట్లాంటి పరాజయమా … నష్టాలు కూడా రికార్డులు సృష్టిస్తున్నాయి.ఓరకంగా సంపత్ నంది బతికిపోయినట్లే.
ఇంత దారుణమైన పరాజయాన్ని చవిచూడకుండా వెళ్ళిపోయాడు
కొన్నిసార్లు జరిగేదేదో మన మంచికే జరుగుతుంది
.