బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటి సమీరా రెడ్డి.ఈ అమ్మడు టాలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టి ఎన్టీఆర్ కి జోడీగా అశోక్, చిరంజీవితో జై చిరంజీవ సినిమాలలో నటించింది.
చివరిగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కృష్ణం వందే జగద్గురుం సినిమాలో ఐటెం సాంగ్ తో సందడి చేసింది.ఆ తరువాత అవకాశాలు తగ్గిపోవడంతో పెళ్లి చేసుకొని సెటిల్ అయిపొయింది.
ఇప్పుడు ఇద్దరి పిల్లల తల్లి అయిన సమీరా రెడ్డి మళ్ళీ తన ఫిట్ నెస్ మెరుగుపరుచుకొని సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుందనే టాక్ గత కొంతకాలంగా వినిపిస్తుంది.బాలీవుడ్ లో ఓ సినిమాలో ఆమె లేడీ విలన్ గా నటించబోతుంది అనే రూమర్ ప్రచారం అయ్యింది.
అయితే ఈ వార్తలని సమీరా రెడ్డి ఫుల్ స్టాప్ పెట్టింది.
తనకి ఇప్పట్లో మళ్లీ సినిమాలలో నటించే ఉద్దేశ్యం లేదని ఆమె చెప్పుకొచ్చింది.అయితే ఆమె మాటల బట్టి సినిమాలలో పూర్తిగా నటించనని మాత్రం చెప్పలేదు.ఈ నేపధ్యంలో మరో వార్త ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది.
ఆమె రీఎంట్రీ ఇవ్వడం పక్కా అని, అయితే ఈ సారి నటిగా కాకుండా హోస్ట్ గా కొత్త కెరియర్ మొదలు పెడుతుందని టాక్ వినిపిస్తుంది.ఓ హిందీ చానల్ రియాలిటీ షోకి ఆమె హోస్ట్ గా వ్యవహరించబోతుందనే మాట బలంగా వినిపిస్తుంది.
మరి బిటౌన్ లో వినిపిస్తున్న ఈ వార్తలపై ఆమె స్పష్టమైన క్లారిటీ ఇస్తే రూమర్స్ అన్నింటికీ ఫుల్ స్టాప్ పడిపోతుంది.అంత వరకు ఆమె రీఎంట్రీ గురించి చర్చ నడుస్తూనే ఉంటుంది.