సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘ఓ బేబీ’ చిత్రం రేపు విడుదల కాబోతుంది.ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో సమంత చాలా యాక్టివ్గా పాల్గొంటుంది.
హీరో లేకపోవడంతో సమంత అన్ని తానై చూసుకుంటుంది.ఇదే సమయంలో ఈ చిత్రంపై అంచనాలు భారీగా క్రియేట్ చేయడంలో సమంత సూపర్ సక్సెస్ అయ్యింది.
తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి.సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి క్లీన్ యూ సర్టిఫికెట్ను జారీ చేయడం జరిగింది.
భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంపై మొదటి నుండి కూడా ఆసక్తి నెలకొంది.అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉందని, చిన్నా పెద్దా అన్ని వర్గాల వారు కలిసి చూసే విధంగా ఓబేబీ చిత్రం ఉందటూ సెన్సార్ బోర్డు రివ్యూ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.క్లీన్ యూ సర్టిఫికెట్తో సినిమాకు మరింత బలం దక్కినట్లయ్యింది.సెన్సార్ బోర్డు సభ్యులు సమంత నటనపై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపించారు.సమంత కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటూ ప్రశంసలు కురిపించారు.
నందిని రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంను సురేష్ బాబు ఇతర ముగ్గురు నిర్మాతలతో కలిసి నిర్మించాడు.కొరియన్ మూవీ మిస్ గ్రానీ చిత్రంకు ఇది రీమేక్ అనే విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం రేపు విడుదల కాబోతుంది.
తక్కువ బడ్జెట్తో ఎక్కువ బిజినెస్ చేసిన ఈ చిత్రం విడుదల తర్వాత మరెంతగా నిర్మాతలకు లాభాలను తెచ్చి పెడుతుందో చూడాలి.