ప్రేమ ఎంత గొప్పది.ఎంత స్వచ్ఛమైనది.
సినిమా సెలబ్రటిలు ప్రేమలో పడ్డారంటే చాలు, ఇలాంటి భావనలు మరచి, వారిని ప్రేమికులు అనే బదులు గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటూ అనేస్తాం మనం.కాని నాగచైతన్య – సమంతల మధ్య బంధం చాలా బలమైనది.ఏం మాయ చేసావే నుంచి మొదలైన స్నేహం ఈనాటికి చెక్కుచెదరలేదు.మధ్యలో సమంత పట్టాలు తప్పి సిద్ధార్థ్ వైపు వెళ్ళినా, నాగచైతన్య అవేమి పట్టించుకోకుండా తన వెంట ఉన్నాడు.
ఇప్పుడు కూడా సినిమాలు మానేయాలని, అది చేయాలని, ఇది చేయాలి అంటూ లేనిపోని కండీషన్స్ పెట్టట్లేదు చైతు.అంత పరిణితి కలిగిన బంధం వీరిది.
ఇప్పుడు సమంత ఏం చేసిందో తెలుసా? తిరుమల వెళ్ళింది.కాలినడకన కొండ ఎక్కింది.
కాని తనకోసం కాదు.నాగచైతన్య కోసం.
అవును, తన ప్రియుడి సినిమా “రారండోయ్ వేడుక చూద్దాం” పెద్ద హిట్ అవ్వాలని కోరుకుందట.చైతు సక్సెస్ కోసమే పూజలు చేసింది.
సమంత హిందువు కాదు, ఓ క్రిస్టియన్.అయినా ప్రేమకు ఈ మతబేధాలు ఉండవని చెప్పటానికి ఈ ఉదాహరణ సరిపోదా.
రారండోయ్ వేడుక చూద్దాం ఈ నెల 26న విడుదల కానుంది.చైతుకి జంటగా రకుల్ ప్రీత్ నటించిన ఈ సినిమాకి కళ్యాణ్ కృష్ణ దర్శకుడు.
చూద్దాం మరి .సమంత చేసిన పూజలకి వేంకటేశ్వరస్వామి ఎలాంటి ఫలితం ఇస్తాడో.