టాలీవుడ్ యంగ్ హీరోల్లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ఒకరు.విజయ్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్దీ సమయంలోనే భారీ ఫాలోయింగ్ ను ఏర్పరుచు కున్నాడు.
అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న తర్వాత వరుస ప్లాప్స్ వస్తున్నా కూడా ఈయనపై అభిమానం ఏమాత్రం తగ్గడం లేదు.ఇటీవలే ఎన్నో అంచనాల మధ్య పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయిన లైగర్ సినిమా అట్టర్ ప్లాప్ అయ్యింది.
ఈ సినిమా ఇచ్చిన షాక్ నుండి ఈ మధ్యనే విజయ్ బయట పడ్డాడు.ఆ తర్వాత తన లైనప్ ను ఇంట్రెస్టింగ్ గా సెట్ చేసుకుంటూ ప్లాప్స్ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ప్రెజెంట్ విజయ్ దేవరకొండ లైనప్ లో ఉన్న సినిమా ‘ఖుషీ’.ఈ సినిమాను శివ నిర్వాణ డైరెక్టర్ చేస్తున్నాడు.
సమంత, విజయ్ కలిసి జంటగా నటిస్తున్న ఈ సినిమా గత కొన్ని నెలలుగా షూట్ ఆగిపోయింది.
లైగర్ సినిమా ప్రమోషన్స్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూట్ ఆ తర్వాత స్టార్ట్ చేద్దాం అంటే సమంత హెల్త్ కారణంగా ఇన్ని రోజులు వాయిదా పడుతూ వస్తుంది.సామ్ కూడా ఈ సినిమా షూట్ తన కారణంగా ఆగిపోయినందుకు విజయ్ ఫ్యాన్స్ కు సారీ కూడా చెప్పింది.ఇదిలా ఉండగా ఇప్పుడు సామ్ హెల్త్ సమస్య నుండి బయట పడడంతో మళ్ళీ షూటింగ్ లలో జాయిన్ కానుంది.
దీంతో ఖుషీ సినిమా త్వరలోనే స్టార్ట్ కాబోతున్నట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే తాజాగా విజయ్ శివ నిర్వాణ, మ్యూజిక్ డైరెక్టర్ హషీమ్ అబ్దుల్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్ వేశారు.దీనికి సంబంధించిన ఫోటో పోస్ట్ చేయడంతో ఈ సినిమా షూట్ త్వరలోనే చేయనున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.ఫిబ్రవరి లాస్ట్ కానీ మార్చి ఫస్ట్ వీక్ లో కానీ ఈ సినిమా స్టార్ట్ కానున్నట్టు క్లారిటీ అయితే వచ్చేసింది.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాతో విజయ్-సమంత ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాల్సిందే.