సినిమా ప్రమోషన్ కోసం భారత్ పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ వాడుకుంటున్న సమంత

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న నటి సమంత.అక్కినేని ఇంటి కోడలిగా వచ్చి టాలీవుడ్ కోడలుగా మారిపోయిన సమంత ప్రస్తుతం ఓ బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 Samantha Used India And Pakistan Match For O Baby Movie Promotion-TeluguStop.com

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్ కోసం ఇప్పుడు సమంత ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అవకాశం వాడుకోవడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.భారత్ పాక్ క్రికెట్ మ్యాచ్ అంటే ఓ రకమైన భావోద్వేగాలతో కూడుకొన్నది.

ఇలాంటి మ్యాచ్ లో సినిమా ప్రమోషన్ అంటే ఎంత మందికి చేరుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.అందుకే సమంత ఈ క్రికెట్ మ్యాచ్ కి తన సినిమా ప్రమోషన్ కోసం వాడుకుంటుంది.

స్టార్ మా ఛానల్ తెలుగులో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో సమంత కూడా కనిపించబోతుంది.ఇదంతా సమంత తన లేటెస్ట్ మూవీ ఓ బేబీ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి చేయడం విశేషం.

ఇక ఈ క్రికెట్ మ్యాచ్ తో పాటు సాయంత్రం ట్విట్టర్ లైవ్ చాట్ లో తన అభిమానులతో సమంత ముచ్చటిస్తుంది.ఈ చాటింగ్లో సంబంధిత పాటు బాలీవుడ్ ఫిలిం క్రిటిక్ రాజీవ్ మసంద్ కూడా పాల్గొనబోతున్నాడు.

మొత్తానికి ఈరోజు తెలుగులో స్టార్ మా స్పోర్ట్స్ ఛానల్ చూసేవారికి ఇండో-పాకిస్తాన్ మ్యాచ్లో మధ్యలో సమంత సందడి కూడా కనిపించింది.దీనికి కారణం ఓ బేబీ సినిమా ప్రమోషన్ స్టడీ లో భాగమే అని తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube