టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత చైతూతో వివాహం తరువాత కూడా వరుస సినిమాలతో తన సత్తా చాటుతూ దూసుకుపోతుంది.ఇటీవల జాను అనే సినిమాతో మనముందుకు వచ్చిన సామ్ తన నెక్ట్స్ మూవీలను లైన్లో పెట్టే పనిలో పడింది.
ఇప్పటికే పలు తమిళ సినిమాలను ఓకే చేస్తున్న సామ్, మరో తమిళ మూవీని కూడా ఓకే చేసినట్లు తెలుస్తోంది.
తమిళ దర్శకుడు అశ్విన్ శరవణన్ డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ థ్రిల్లర్ సినిమాలో తమిళ హీరో ప్రశాంత్ లీడ్ రోల్లో నటించనున్నాడు.
ఈ సినిమాలో హీరోయిన్గా సమంతను ఓకే చేశారట చిత్ర యూనిట్.దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.ఈ సినిమా కథ బాగా నచ్చడంతో సామ్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.అయితే ప్రశాంత్ లాంటి సీనియర్ హీరోతో సామ్ నటించడంతో ఆమె ఫ్యాన్స్ కాస్త ఫీల్ అవుతున్నారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ఏదేమైనా సామ్ లాంటి స్టార్ బ్యూటీ యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలను కూడా లైన్లో పెట్టడంతో ఆమె ఫ్యాన్స్ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో చూడాలి అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.