రాక్స్టార్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే.దిల్రాజు నిర్మాణంలో సుకుమార్ దర్శకత్వంలో దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఒక సినిమా తెరకెక్కబోతుంది.
ఆ సినిమాకు సంబంధించిన స్టోరీ లైన్ సైతం ఫైనల్ అయ్యిందని, ప్రస్తుతం ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం విడుదల పనుల్లో బిజీగా ఉన్న సుకుమార్ త్వరలో దేవిశ్రీ కోసం స్క్రిప్ట్ను రెడీ చేయబోతున్నాడు.ఈలోపు దిల్రాజు తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.
దేవిశ్రీ సినిమా కోసం హీరోయిన్గా సమంతను ఎంపిక చేసే పనిలో ఈ నిర్మాత ఉన్నట్లుగా తెలుస్తోంది.
కొత్త హీరోలతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపించే సమంత ఈ చిత్రంలో నటించేందుకు ముందుకు వస్తుంనే నమ్మంతో దిల్రాజు ఉన్నట్లుగా తెలుస్తోంది.
ప్రస్తుతం మహేష్బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలో మరియు చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిత్రంలో సమంత హీరోయిన్గా నటిస్తుంది.ఆ చిత్రాలతో పాటు తమిళంలో కూడా సమంత సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.
దేవిశ్రీ ప్రసాద్ సినిమాను తెలుగుతో పాటు తమిళంలో విడుదల చేయాలని భావిస్తున్నారు.అందుకే సమంత అయితే తెలుగు మరియు తమిళంలో మంచి క్రేజ్ ఉన్న హీరోయిన్ అని, అందుకే ఈమెను ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.
.