నాగచైతన్య సమంత విడిపోతున్నామని షాకింగ్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.ఈ ప్రకటన తర్వాత సమంత ఎవరు మీలో కోటీశ్వరులు షోకు అతిథిగా హాజరయ్యారు.
అయితే ఈ షోలో సమంత గతంలోలా యాక్టివ్ గా కనిపించలేదు.పైకి నవ్వుతున్నా సమంత బాధలో ఉన్నారని ఆమె ముఖం చూస్తే అర్థమవుతోంది.
విడాకుల వల్ల సమంతకు కలిగిన బాధ కంటే విడాకుల తర్వాత వైరల్ అయిన ట్రోల్స్ వల్లే సమంత ఎంతో బాధ పడ్డారు.
సమంత పరువుకు భంగం కలిగించేలా సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఎన్నో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.
ఆ ట్రోల్స్ గురించి సమంత సోషల్ మీడియా వేదికగా స్పందించి క్లారిటీ ఇచ్చారు.చైతన్యతో విడిపోతున్నట్టు వెల్లడించిన తర్వాత యాడ్ షూటింగ్ లో సైతం సమంత కన్నీళ్లు పెట్టుకున్నారనే సంగతి తెలిసిందే.
సమంత ఎవరు మీలో కోటీశ్వరులు షోలో టైడ్ గా, వాడిపోయిన ముఖంతో కనిపించడం గమనార్హం.
బాధను కనిపించకుండా నవ్వాలని సమంత ప్రయత్నం చేసినా సమంత ఇంకా బాధ పడుతున్నారని ఆమె ముఖం చూస్తే అర్థమవుతుంది.
ఈ షోలో సమంత తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎలాంటి కామెంట్లు చేయలేదు.ఎన్టీఆర్ తో సరదాగా మాట్లాడటం మినహా వ్యక్తిగత జీవితం గురించి చెప్పడానికి సమంత ఏ మాత్రం ఇష్టపడలేదు.మరోవైపు సమంత భవిష్యత్తు ప్రాజెక్టుల గురించి త్వరలో క్లారిటీ రానుందని తెలుస్తోంది.
ఈరోజు సమంత సినిమాకు సంబంధించిన ప్రకటన రానుందని ప్రచారం జరుగుతోంది.సమంత ప్రస్తుతం కెరీర్ పై పూర్తిగా దృష్టి పెట్టారని సినిమాల ద్వారా బిజీ అయ్యే దిశగా సమంత అడుగులు వేస్తున్నారని సమాచారం.సమంత శాకుంతలం షూటింగ్ ను ఇప్పటికే పూర్తి చేయగా తర్వాత సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో చూడాల్సి ఉంది.
భారీ బడ్జెట్ సినిమాలపై సమంత దృష్టి పెడుతుండటం గమనార్హం.