టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చేతిలో ప్రస్తుతం పెద్దగా సినిమాలు లేవు.ఎక్కువగా లేడీ ఒరియాంటెడ్ చిత్రాలపై ఆసక్తి చూపించడంతో స్టార్ హీరోల చిత్రాలు అంగీకరించడం లేదు.
అయితే అలా అని ఈ అమ్మడు ఖాళీగా కూడా లేదు.ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా పార్టీలు, ఇతర ఫంక్షన్ లు కూడా పూర్తిగా బంద్ కావడంతో ఆమె తన మిడిల్ క్లాస్ లైఫ్ లోకి వచ్చి తనకి ఇష్టమైన ఫార్మింగ్ మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది.
రైతుగా మారి టెర్రస్ గార్డెనింగ్ చేస్తుంది.సమంత, చైతూకు హైదరాబాద్లో అద్భుతమైన ఇల్లు ఉంది.
ఇంట్లోనే స్విమ్మింగ్ పూల్ సహా సకల సదుపాయాలు ఉన్నాయి.ఈ ఇంటి టెర్రస్పై ఖాళీగా ఉన్న ప్రదేశంలో కూరగాయలు పండించేందుకు సమంత సిద్ధమైపోయింది.
దీనికోసం సామ్ స్పెషల్ గా ఆన్ లైన్ క్లాసులు తీసుకొనిటెర్రస్ గార్డెనింగ్ లో మెలుకువలు నేర్చుకుంది.మిద్దె పంటతో కూరగాయల మొక్కలు, పూల మొక్కలు పండించాలని వేయాలని అనుకుంటుంది.
ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది.తాను మిద్దె తోట నుంచి కూరగాయాలను పండిస్తున్నట్టు చెప్పింది.
మొత్తానికి సిటీలలో భాగా ఫేమస్ అయిన టెర్రస్ గార్డెనింగ్ లో సమంత కూడా మెలుకువలు నేర్చుకొని మేడపైనే వ్యవసాయం చేసి మరికొందరికి ఆదర్శంగా నిలుస్తుంది