టాలీవుడ్ స్టార్స్ నిర్మాతలుగా మారడం కొత్తేం కాదు.మహేష్, పవన్, చరణ్, ప్రభాస్ నాని ఇంకా పలువురు నిర్మాణ సంస్థలను నిర్వహిస్తున్నారు.
కొత్త హీరోలు కూడా సొంత నిర్మాణ సంస్థలను కలిగి ఉంటున్నారు.చిన్న బడ్జెట్ నుండి పెద్ద బడ్జెట్ సినిమాల వరకు వీరు నిర్మిస్తున్నారు.
పెద్ద ఎత్తున బడ్జెట్ సినిమాలను నిర్మిస్తున్న వీరిలో కొందరు సక్సెస్ అయితే మరికొందరు మాత్రం నిరాశ పడ్డారు.నిర్మాతల జాబితాలోకి సమంత కూడా చేరబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
సమంత నిర్మాతగా మారబోతున్నట్లుగా గత ఏడాదిలోనే వార్తలు వచ్చాయి.కాని ఏవో కారణాల వల్ల సినిమా వర్కౌట్ అవ్వలేదు.ఇప్పుడు ఒక యువ దర్శకుడు చెప్పిన స్టోరీ లైన్కు సమంత ఫిదా అయ్యిందట.తాను నటించకుండా అంతా కొత్త వారితో ఆ సినిమాను కోటి రూపాయల బడ్జెట్లో నిర్మించేందుకు సిద్దం అవుతుందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
నాగచైతన్య ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించబోతున్నాడట.త్వరలోనే సినిమాను ప్రారంభించి వచ్చే ఏడాదిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా సమంత అండ్ నాగచైతన్యలు ప్లాన్ చేస్తున్నారు.వీరిద్దరు ప్లాన్ చేస్తే అది అదిరి పోవడం ఖాయం.ఇప్పుడు వీరిద్దరిది టాలీవుడ్లోనే మోస్ట్ ఎట్రాక్టివ్ జోడీ.అందుకే వీరిద్దరు కలిసి నిర్మిస్తే ఆ సినిమాకు కోటి రూపాయల పబ్లిసిటీ అవుతుంది.అందుకే మంచి బిజినెస్ అవ్వడం ఖాయం.
సమంతకు లాభాలు రావడం పక్కా అంటున్నారు అక్కినేని అభిమానులు.