టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత విడాకుల తర్వాత తన కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న విషయం తెలిసిందే.అయితే ప్రెసెంట్ సమంత ఆధ్యాత్మిక యాత్రల్లో బిజీగా ఉంది.
ఆమె స్నేహితురాలు శిల్పా రెడ్డి తో కలిసి యాత్రకు వెళ్ళింది.అక్కడికి వెళ్లినప్పటి నుండి సమంత సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ లు పెడుతూ వస్తుంది.
తాజాగా మరొక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
సమంత తన స్నేహితురాలు శిల్పా రెడ్డితో కలిసి చార్ ధామ్ యాత్రకు వెళ్ళింది.
అయితే ఈ యాత్రను పూర్తి చేసినట్టు సమంత సోషల్ మీడియా ద్వారా తెలిపింది.చార్ ధామ్ యాత్రలో భాగంగా ఇప్పటి వరకు సమంత గంగోత్రి, యమునోత్రి, కేదారనాధ్, బద్రీనాధ్ ప్రదేశాలను సందర్శించినట్టు సామ్ ట్వీట్ చేసింది.
దీంతో పాటు ఒక ఫోటో ను కూడా షేర్ చేసింది.
తనకు మహాభారతం చదివినప్పటి నుండి హిమాలయాల పట్ల ఆసక్తిగా ఉన్నానని సామ్ తెలిపింది.
ఒక ఫోటోను షేర్ చేస్తూ.మహాభారతం చదివినప్పటి నుండి గ్రేట్ మిస్టరీ ని, దేవుళ్లు నివాసం ఉండే ప్రాంతం అయినా భూలోక స్వర్గాన్ని దర్శించాలని అనుకుంటున్నానని సామ్ తెలిపింది.
దీంతో పాటు ఆమె సక్సెస్ ఫుల్ గా ఈ చార్ ధామ్ యాత్రను పూర్తి చేసినట్టు కూడా తెలిపింది.
ఇక సమంత సినిమాల విషయానికి వస్తే.ఇటీవలే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో నటించి మరొకసారి నటిగా మెప్పించింది.ఇక ఇప్పుడు సమంత నటించిన ‘శాకుంతలం‘ సినిమా ఈ మధ్యనే షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఇక త్వరలోనే విడుదలకు చేయబోతున్నారు.అలాగే తమిళ్ లో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో చేస్తున్న ‘కాతు వాకుల రెండు కాదల్’ సినిమా కూడా షూటింగ్ జరుపు కుంటుంది.
ఈ సినిమాలో నయనతార కూడా నటిస్తుంది.
ఈ రెండు సినిమాలతో పాటు దసరా పండుగ సందర్భంగా మరొక రెండు కొత్త ప్రాజెక్ట్స్ కూడా ప్రకటించి అభిమానులను సంతోష పరిచింది.ఈ రెండు సినిమాలు లేడీ ఓరియెంటెడ్ అనే తెలుస్తుంది.మొత్తానికి సామ్ తన లైఫ్ లో జరిగిన విడాకుల సంఘటనను మర్చిపోవడానికి వీలైనంత వరకు ప్రయత్నిస్తుంది.