టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా, పెద్దింటి కోడలిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ కొనసాగుతున్న ఈమె అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకోని వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉండేది.
అయితే గత కొద్ది రోజుల నుంచి సమంత నాగచైతన్య విడిపోతున్నారు అంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ వీరి విడాకుల విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.ఇక విడాకుల అనంతరం సోషల్ మీడియాలో సమంతా ఏ చిన్న పోస్ట్ చేసిన దానిని వైరల్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సమంత ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా సంచలన వ్యాఖ్యలు షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ క్రమంలోనే సమంత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలియజేస్తూ.
ఎప్పుడు మహిళలనే ప్రశ్నించే.ఈ సమాజం పురుషులను ఎందుకు ప్రశ్నించలేదు.
అలాంటప్పుడు మనకు ప్రాథమికంగా నైతిక విలువలు లేనట్టే.అంటూ ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా పోస్ట్ చేశారు.
సమంత విడాకుల విషయంలో కేవలం సమంత మాత్రమే తప్పు ఉందని పలువురు సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో తన మనసులో ఉన్న బాధను మొత్తం ఈ విధంగా బయటపెట్టినట్లు తెలుస్తోంది.
విడాకులు తీసుకున్న తర్వాత సమంత ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ లో ఈమె బోల్డ్ గా కనిపించడం విడాకులకు కారణం అంటూ కొందరు కామెంట్లు చేయగా మరికొందరు తన డిజైనర్ ప్రీతమ్ అంటూ అతనిని దారుణంగా ట్రోల్స్ చేయడం సమంతను బాధ పెట్టినట్లు తెలుస్తోంది.ఇప్పటికే చైతన్యతో విడాకులు తీసుకొని ఎంతో బాధ పడుతున్న సమంతను ఈ విధమైనటువంటి కామెంట్స్ ద్వారా మరింత ఒత్తిడికి గురి చేస్తున్నారంటూ సన్నిహితులు తెలియజేస్తున్నారు.ఇలా ఏడు సంవత్సరాల స్నేహ బంధానికి,నాలుగు సంవత్సరాల వివాహబంధానికి స్వస్తి చెప్పిన అనంతరం సమంత చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.