టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత నాగచైతన్య విడాకులు ఇచ్చిన తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.విడాకుల అనంతరం సమంత ఎక్కడికి వెళ్ళినా కూడా తన ప్రతి కదలికల గురించి తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
విడాకుల తరువాత నిత్యం ఏదో ఒక రకాల పోస్టులు చేస్తూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.ఈ మధ్య కాలంలో సమంత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా కనిపిస్తోంది.
అయితే విడాకుల బాధ నుంచి బయటపడటానికి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటంతోపాటు, సినిమాలవైపు దృష్టి సారిస్తోంది.
ఈ క్రమంలోనే వరుస సినిమా అవకాశాలు అందుకుంటూ కేరీర్ పరంగా దూసుకుపోతోంది.
ఇకపోతే ఇటీవలే పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ కు స్టెప్పులు ఇరగదీసిన విషయం తెలిసిందే.ఈ పాట రిలీజ్ అయిన తర్వాత ఎక్కడ చూసినా కూడా మారుమోగిపోయింది.
ఇప్పటికీ ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూనే ఉంది.ఇదిలా ఉంటే తాజాగా సమంత టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున పై సంచలన కామెంట్స్ చేసింది.
అయితే సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఇంస్టాగ్రామ్ లో, ట్విట్టర్ లో పలు రకాల పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే అలా పోస్టులు పెడుతూ అక్కినేని ఫ్యామిలీ ని పరోక్షంగా విమర్శిస్తోంది అని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే సమంత చేసిన పలు పోస్టులపై నెటిజెన్స్ కామెంట్స్ చేయగా వారికీ స్ట్రాంగ్ గా అదిరిపోయే కౌంటర్ లు ఇస్తోంది.సోషల్ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం.ఇటీవలే నాగార్జున సమంత కు కాల్ చేశాడట.ఆ సమయంలో ఆమె ఫోన్ లిఫ్ట్ చేయకుండా పక్కన పెట్టేసింది అని సమాచారం.ఈ నేపథ్యంలోనే సమంత తన పక్కన ఉన్న ఒక టాలీవుడ్ హీరోతో నాగార్జున గురించి మాట్లాడుతూ ఈ విధంగా అనిందట.నాగార్జునకు ఇంట్లో అంత సీన్ లేదని, తన భార్య అమల చెప్పింది వింటాడని, ఆయనతో మాట్లాడి వేస్ట్ అని సమంత తెలిపిందట.
అయితే ఈ మాట సమంత అనిందా లేదా అన్న విషయం పక్కన పెడితే ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.మరి సోషల్ మీడియా లో వినిపిస్తున్న వార్తలు నిజం ఉందా లేక ఇవి అసత్య ప్రచారాల అన్నది తెలియాలి అంటే అధికారికంగా ప్రకటన వచ్చే అంత వరకు వేచి చూడాల్సిందే.