రుద్రమదేవి తర్వాత అయిదు ఏళ్లకు పైగా గ్యాప్ తీసుకున్న గుణశేకర్ ఎట్టకేలకు సమంత తో శాకుంతలం సినిమాను తెరకెక్కించాడు.భారీ పీరియాడిక్ డ్రామా అంటూ ప్రచారం చేశారు.
కాని తక్కువ సమయంలోనే షూటింగ్ ను ముగించి అందరిని ఆశ్చర్యపర్చారు.పెద్ద ఎత్తున అంచనాలున్న శాకుంతలం సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యి చాలా రోజులు అవుతుంది.
కాని ఇప్పటి వరకు సినిమా విడుదలకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు.అసలు సినిమా ఎప్పుడు ఉంటుంది ఎలా ఉంటుంది అనే విషయాలను పూర్తిగా సస్పెన్స్ గా ఉంచుతున్నారు.
ఇప్పటి వరకు సమంతకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కూడా రివీల్ చేయలేదు.ఎలాంటి అప్ డేట్ కూడా ఇవ్వక పోవడంపై కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ సమయంలో సమంత కు సంబంధించిన ఏ అప్ డేట్ అయినా కూడా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి రావచ్చు.ఎందుకంటే చైతూ తో బ్రేకప్ తర్వాత ఆమె పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి.
శాకుంతలం సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యి చాలా రోజులు అవుతున్నా కూడా విడుదలకు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ ఇవ్వక పోవడంకు ప్రథాన కారణం సమంత విడాకులు అంటూ కొందరు ఊహించేసుకుంటున్నారు.కారణం ఏంటీ అంటే శాకుంతలం సినిమా ను ఇప్పుడు విడుదల చేస్తే సమంత పై ఉన్న నెగటివిటీ అంతా కూడా ఆ సినిమాపై పడబోతుంది.అందుకే ఈ సమయంలో శాకుంతలం ను విడుదల చేయక పోవడం మంచిది అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.అదే ఉద్దేశ్యంతో గుణశేఖర్ కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే సమ్మర్ వరకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశమే లేదు అంటున్నారు.అప్పటి వరకు పరిస్థితులు అన్ని నార్మల్ అవుతాయని అంతా అనుకుంటున్నారు.