సమంత అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూడు సినిమా లు కూడా ఇదే ఏడాది బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.ముఖ్యంగా చాలా రోజులుగా వెయిట్ చేయిస్తున్న శాకుంతలం సినిమా గురించిన విడుదల తేదీ ప్రకటన దసరాకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
అంతే కాకుండా ఇదే ఏడాది చివర్లో సినిమా ను విడుదల చేయబోతున్నట్లుగా గుణశేఖర్ టీమ్ నుండి ప్రకటన వస్తుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ఇక శాకుంతలంతో పాటు యశోద సినిమా ను కూడా సమంత అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేసిన విషయం తెల్సిందే.
పాన్ ఇండియా సినిమా గా ఈ రెండు సినిమా లు రూపొందాయి.ఈ రెండు సినిమా లు కూడా షూటింగ్ ను ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి.
కనుక ఎలాంటి డౌట్ లేకుండా ఈ సినిమా లను ఇదే ఏడాది లో విడుదల చేస్తారని సమంత అభిమాలు అంటున్నారు.ఈ రెండు సినిమా లతో పాటు విభిన్న చిత్రాల దర్శకుడు శివ నిర్వాన దర్శకత్వం లో రూపొందుతున్న ఖుషి సినిమా ను కూడా ఇదే ఏడాది లో విడుదల చేస్తారట.
ఖుషి సినిమా లో విజయ్ దేవరకొండ మరియు సమంత లు చాలా రొమాంటిక్ కపుల్ గా లవ్ బర్డ్స్ గా కనిపించబోతున్నారట.ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం దర్శకుడు శివ నిర్వాన ఖుషి సినిమా ను లైగర్ విడుదల అయిన కొన్ని వారాలకే విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నాడట.కనుక ఖుషి కూడా ఇదే ఏడాది లో వస్తుంది.అంటే సమంత నటించిన మూడు తెలుగు సినిమా లు కూడా కాస్త గ్యాప్ లో ఇదే ఏడాది లో విడుదల అవ్వబోతున్నాయి.
ఈ వార్త సమంత అభిమానులకు పండుగే.ఈ మూడు సినిమాల విడుదల తేదీ లు అతి త్వరలోనే వస్తాయనే నమ్మకం వ్యక్తం అవుతోంది.