టాలీవుడ్ లో ఎంతో అన్యోన్యంగా ఉండే కపుల్స్ లో సమంత, నాగ చైతన్య ముందు వరుసలో ఉండే వారు.అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల సామ్, నాగ చైతన్య విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.
గత కొన్నేళ్లుగా స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సామ్ నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.అయితే వీరి వివాహ బంధానికి నాలుగు సంవత్సరాలు కూడా నిండకుండానే విడాకులు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చారు.
వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు కానీ అందుకు గల కారణాలు ఇప్పటి వరకు బయటకు రాలేదు.కానీ సమంత, నాగ చైతన్య విడాకుల తర్వాత కెరీర్ మీద దృష్టి పెట్టి వరుస సినిమాలు ప్రకటిస్తూ ఇద్దరు కూడా బిజీగా ఉన్నారు.
ఇక సమంత విడాకుల తర్వాత మానసికంగా దృఢంగా మారాలని గట్టిగానే ప్రయత్నిస్తుంది.
సామ్ విడాకుల తర్వాత వరుస సినిమాలు చేస్తుంది.
ఇటీవలే హాలీవుడ్ మూవీకి కూడా సైన్ చేసి అందరికీ ఆశ్చర్యం కలిగించింది.అయితే విడాకుల విషయంలో సామ్ ఎంత బాధ పడిందో ఆమెనే స్వయంగా మీడియాకు తెలిపింది.
తాజాగా సమంత ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో విడాకుల విషయంపై స్పందించింది.విడాకులు ఎలాంటి పరిస్థితుల్లో తీసుకున్నారో.
అందుకు ఎంత బాధపడిందో తెలిపింది.
సామ్ మాట్లాడుతూ.”మా ఇద్దరి మధ్య జరిగిన చాలా చర్చల తర్వాత మేము ఈ నిర్ణయం తీసుకున్నాము.ఇందులో తప్పు ఎవరిదీ అనేది నేను చెప్పలేను.
కానీ విడాకులు తీసుకున్నాకా నేను ఎంత స్ట్రాంగ్ గా ఉన్నానో నాకు తెలిసింది. నేను విడాకుల తర్వాత చనిపోతానేమో అనుకున్నాను.
నేను అంత బలహీనురాలిగా అనిపించింది.ఆ తర్వాత మెల్లగా నా సమస్యలతో పోరాడి.
కృంగిపోకుండా పైకి లేచి ఈ రోజు మీ ముందు ఇంత దృఢంగా ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను” అంటూ సామ్ తెలిపింది.ఇక సామ్ విడాకులపై చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.