టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా కోసం సామ్ జామ్ టాక్ షో చేసేందుకు ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.తెలుగు ప్రత్యేక ఓటీటీ అయిన ఆహా లో సామ్ జామ్ అనగానే అందరు చాలా ఇంట్రెస్ట్ గా ఎదురు చూశారు.
ఒక స్టార్ హీరోయిన్ టాక్ షో అంటూ అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి.మొదటి ఎపిసోడ్ లో నిరాశ పర్చిన సమంత ఆ తర్వాత మెల్ల మెల్లగా సక్సెస్ దిశగా దూసుకు వెళ్లింది.
మొత్తం ఏడు ఎపిసోడ్ లు ఇప్పటి వరకు స్ట్రీమింగ్ అయ్యాయి.ఈ వారం నాగచైతన్య ను సమంత తీసుకు రాబోతుంది.
తన భర్తతో సమంత చేయబోతున్న ఎపిసోడ్ తో ఈ సీజన్ కు ఫుల్ స్టాప్ పెట్టేందుకు సిద్దం అయ్యిందని వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం 8 ఎపిసోడ్ లతో ఈ సీజన్ ముగియబోతుంది.
మొదట 10 ఎపిసోడ్ లను ప్లాన్ చేశారు.ఎపిసోడ్ కు ఒక్క రోజు చొప్పున డేట్ ను సమంత కేటాయించాల్సి ఉంటుంది.అందుకు గాను ఆమెకు 15 లక్షల రూపాయల పారితోషికంను ఆఫర్ చేశారు.మొత్తం పది ఎపిసోడ్ లకు 1.5 కోట్ల పారితోషికం డీల్ అయ్యింది.కాని కొన్ని కారణాల వల్ల మరో రెండు ఎపిసోడ్ లు ఉండగానే సమంత షో ను ఆపేస్తుందని తెలుస్తోంది.
సామ్ జామ్ మళ్లీ ఉంటుందా లేదా అనే విషయంలో కూడా క్లారిటీ లేదు.నాగచైతన్య ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో వచ్చింది.అందులో ఇంట్లోనే ఉంటాడు కదా ఎప్పుడు పిలిచినా వస్తాడు కదా అని చివర్లో పిలిచావా అంటూ కౌంటర్ వేశాడు.ఆ కౌంటర్ తో సమంత ఈ సీజన్ కు చైతూ ఎపిసోడ్ తో ఫుల్ స్టాప్ పెట్టబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఈ షో కోసం ఎపిసోడ్ లను తీసుకు రావడం చాలా పెద్ద టాస్క్ గా మారింది.చిన్న వారిని తీసుకు వస్తే ప్రయోజనం ఉండదు.
పెద్ద వారిని తీసుకు వచ్చేందుకు కరోనా వల్ల సాధ్యం అవ్వడం లేదు.అందుకే సామ్ జామ్ సీజన్ 1 ముందే ముగించేశారు.