ఏ మాయ చేశావె సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలతో, వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకుంది సమంత.పెళ్లి తరువాత పరిమితంగా సినిమాల్లో నటిస్తున్న సమంత దసరా పండుగ రోజున బిగ్ బాస్ షోలో పాల్గొని హోస్ట్ గా మంచి పేరు సంపాదించుకుంది.
ప్రస్తుతం సమంత ఆహా ఓటీటీలో సామ్ జామ్ అనే టాక్ షోను హోస్ట్ చేస్తోంది.
టాక్ షోలో ఫస్ట్ ఎపిసోడ్ లో భాగంగా విజయ్ దేవరకొండ ఈ షోకు హాజరయ్యారు.
భారీ అంచనాలతో తొలి ఎపిసోడ్ ను చూసిన సమంత ఫ్యాన్స్ నిరాశకు గురవుతున్నారు.సామ్ జామ్ టాక్ షో ఏ మాత్రం ఆసక్తికరంగా లేకపోవడంతో ఈ షో హోస్ట్ చేయడానికి సమంత ఒప్పుకోకపోయి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.
సమంత హోస్ట్ గా బాగానే చేసినా ఏ మాత్రం ఆసక్తి లేకుండా షో ఉండటం గమనార్హం.
సామ్ జామ్ కిచిడీలా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారంటే ఈ షో ఎలా ఉందో సులభంగానే అర్థమవుతుంది.
తొలి ఎపిసోడ్ ప్రోమో షోపై అంచనాలు పెంచగా సమంత షో రొటీన్ చాట్ షోను తలపించిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.సమంత షో అంటే ఎంటర్టైన్మెంట్ ను మాత్రమే కోరుకుంటామని ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.
అయితే తొలి ఎపిసోడ్ నెగిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఇకముందైనా సామ్ జామ్ షో నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి.
సమంత మొత్తం పది ఎపిసోడ్లకు హోస్ట్ గా వ్యవహరించనున్నారని ఒక్కో ఎపిసోడ్ కు 15 లక్షల రూపాయల చొప్పున కోటిన్నర రూపాయలు సమంతకు పారితోషికం ఇవ్వనున్నారని సమాచారం.
ఇప్పటికైతే ఈ షోను ఫ్లాప్ షో అని చెప్పలేం కానీ రాబోయే ఎపిసోడ్లు కూడా ఇదే విధంగా ఉంటే మాత్రం సామ్ జామ్ టాక్ షో ఫ్లాప్ షోగానే మిగిలే అవకాశం ఉంది.