స్టార్ హీరోయిన్ సమంత నటించిన ది ఫ్యామిలీ మేన్ 2 వెబ్ సిరీస్ మరో రెండు రోజుల్లో రిలీజ్ కానుంది.సమంత పాత్ర వివాదంలో చిక్కుకోవడంతో ఈ వెబ్ సిరీస్ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఫ్యామిలీ మేన్ 1 హిట్ కాగా ఫ్యామిలీ మేన్ 2 ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాల్సి ఉంది.అయితే తాజాగా ఒక సందర్భంలో సమంత తన గురించి, నాగచైతన్య గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
తనలో తనకు నచ్చిన విషయాల గురించి చెబుతూ శారీరక బలం, నవ్వు, కళ్లు తనకు ఇష్టమని సమంత అన్నారు.తనలో ఉన్న ఈ మూడు క్వాలిటీస్ వల్లే తనను ప్రేక్షకులు అభిమానిస్తూ ఉండవచ్చని సమంత అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రతి మనిషి తనలో తనకు ఏమి ఇష్టమో తెలుసుకోవాలని అప్పుడు మాత్రమే ఆ మనిషి సంతోషంగా జీవించడం సాధ్యమవుతుందని సమంత చెప్పుకొచ్చారు.
కరోనా సెకండ్ వేవ్ లో వైరస్ శరవేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో శారీరకంగా ఫిట్ గా ఉండటంతో పాటు మానసికంగా హెల్తీగా ఉండాలని సమంత అన్నారు.తాను వ్యాయామం చేయడంతో పాటు యోగా కూడా ఎక్కువగా చేస్తానని సమంత చెప్పుకొచ్చారు.భర్త చైతన్య గురించి చెబుతూ తనకు, చైతన్యకు మధ్య గొడవలు జరుగుతుంటాయని ఆమె అన్నారు.
అయితే తనకు సిగ్గు లేదని అందువల్లే గొడవ జరిగిన సమయంలో మొదట తనే రాజీ పడతానని సమంత పేర్కొన్నారు.
తమిళంలో ఒక సినిమాలో నటిస్తున్న సమంత తెలుగులో మాత్రం శాకుంతలం సినిమాలో మాత్రమే నటిస్తున్నారు.గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.ఫ్యామిలీ మేన్ సీజన్ 2లో సమంత నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుండగా ఆ పాత్ర సమంత కెరీర్ కు ప్లస్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది.