సూపర్ స్టార్ మహేష్బాబు త్వరలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో నటించనున్నాడు.ప్రసాద్ వి పొట్లూరి నిర్మాణంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాను మహేష్బాబు సమర్పించబోతున్నాడు.
ఈ సినిమాలో మొదట హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ను ఎంపిక చేయడం జరిగింది.అయితే ఎన్టీఆర్తో సినిమా కమిట్ అవ్వడం, ఆ సినిమా షూటింగ్కు ఎక్కువ డేట్లు ఇవ్వాల్సి ఉండటంతో పాటు రెండు సినిమాలు ఒకే సారి చిత్రీకరణ జరుపుకోనున్న నేపథ్యంలో డేట్లు కుదరక పోవడం వల్ల రకుల్ ఈ సినిమా నుండి తప్పుకుంది.
రకుల్ తప్పుకున్న స్థానంలో ఎవరు వస్తారా అని ఆసక్తిగా ఎదురు చూసిన ప్రేక్షకులకు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల సమంతతో సమాధానం చెప్పాడు.ఇప్పటికే ‘దూకుడు’, ‘సీతమ్మ…’ సినిమాలతో జత కట్టిన మహేష్, సమంతలో మరోసారి ఈ సినిమా కోసం జత కట్టేందుకు రెడీ అవుతున్నారు.
వీరిద్దరికి సక్సెస్ కాంబినేషన్ అవ్వడంతో ఈసారి కూడా సినిమా ఘన విజయం సాధించడం ఖాయం అంటూ ఇప్పటి నుండే ఫ్యాన్స్ అంచనాలు వేస్తున్నారు.వీరిద్దరు హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అని సినీ వర్గాలు సైతం అంటున్నాయి.
ఈ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.