అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది.ఒకటి రెండు వారాల్లో సినిమా కు గుమ్మడి కాయ కొట్టబోతున్నారు.
రికార్డులు బ్రేక్ చేసేంతటి వసూళ్లను ఈ సినిమా కు అభిమానులు ఆశిస్తున్నారు.ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుండి కూడా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ను ఈ సినిమాకు గాను ఐటెం సాంగ్ చేయించేందుకు చర్చలు జరుగుతున్నట్లుగా చాలా మంది పేర్లు వినిపించాయి.
కోటి రూపాయలకు పైగా ఖర్చు చేసి బాలీవుడ్ హాట్ బ్యూటీని తీసుకు వస్తామంటూ సుకుమార్ టీమ్ కూడా ఒకానొక సమయంలో చెప్పారు.కాని ఇప్పుడు సమంతను పుష్ప ఐటెం అంటూ ప్రకటించారు.
అధికారికంగా పుష్ప సినిమా లో సమంత ఐటెం సాంగ్ చేస్తుందని తేల్చి చెప్పారు.ఇక ఈ సినిమా లో ఐటెం సాంగ్ చేస్తున్నందుకు గాను సమంత ఏకంగా 1.5 కోట్ల పారితోషికంను అందుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలు అయ్యింది.చిత్ర పీఆర్ టీమ్ ఈ విషయాన్ని స్వయంగా మీడియాకు అంటించాడు.
దాంతో మీడియాలో పెద్ద ఎత్తున ఈ విషయమై చర్చ జరుగుతోంది.
అసలు విషయం ఏంటీ అంటే పుష్ప సినిమాలో సమంత నటిస్తున్నందుకు గాను అంత పారితోషికం ఏమీ తీసుకోవడం లేదట.హీరోయిన్ గా నటించిన రష్మికకే కోటిన్నర పారితోషికం ఇస్తున్నారు.అలాంటిది సమంతకు ఎందుకు అంత పారితోషికం ఇస్తారు.
మీడియాలో వస్తున్న పుకార్లు నిజం కాదు.పీఆర్ టీమ్ కావాలని సమంత గురించి ఈ పుకారు మొదలు పెట్టారు.
అసలు సమంత ఈ ఐటెం సాంగ్ కు గాను 50 నుండి 60 లక్షలు మాత్రమే తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు.అది కూడా సమంత కు ప్రస్తుతం చాలా పెద్ద మొత్తంగానే ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.